AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. షాక్‌కు గురైన ప్రియురాలు ఏం చేసిందంటే..

అతడు, ఆమె గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని, తమ నూరేళ్ల జీవితాన్ని తలచుకుని ఎంతో మురిసిపోయారు. కానీ ఇంతలో విధి వారి జీవితాలను అనుకోని..

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. షాక్‌కు గురైన ప్రియురాలు ఏం చేసిందంటే..
Tamil Nadu Crime News
Srilakshmi C
|

Updated on: Feb 19, 2023 | 4:45 PM

Share

అతడు, ఆమె గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని, తమ నూరేళ్ల జీవితాన్ని తలచుకుని ఎంతో మురిసిపోయారు. కానీ ఇంతలో విధి వారి జీవితాలను అనుకోని ములుపు తిప్పింది. రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. అతని ఎడబాటును భరించలేక ఆమెకూడా తనువుచాలించి. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా ఆవడి దేవాలయం, పూంపోజిల్‌ పట్టణానికి చెందిన రాజేంద్రన్‌ కుమార్‌ వినోదిని (22) ఎంబీఏ చదువుతోంది. ఆవడి సమీపంలోని ముఠాపుటుప్‌ పేట కరిమేడు గ్రామానికి చెందిన వసంత్‌ (23), వినోదిని గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పది రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 10న వసంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రియుడి మృతి చెందినప్పటి నుంచి తీవ్రమనస్తాపానికి గురైన వినోదిని ముభావంగా ఉండేది. ప్రియుడు లేని జీవితం వృధా అనుకోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Tamil Nadu

Tamil Nadu

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ప్రియుడు దుర్మరణం చెందడంతో ప్రియురాలు మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఇన్స్‌పెక్టర్‌ గోపీనాథ్‌ తెలిపాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.