Sena vs Sena: విల్లు, బాణం గుర్తు కోసం షిండే, థాక్రేల పోరు.. శివసేన వివాదం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ..

Maharashtra political crisis: శివసేన పార్టీ గుర్తు విల్లు, బాణం ఎవరిది? రియల్‌ సేనదా, రెబల్‌ సేనదా? ఈ వివాదంపై రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టనుంది.

Sena vs Sena: విల్లు, బాణం గుర్తు కోసం షిండే, థాక్రేల పోరు.. శివసేన వివాదం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ..
Shiv Sena Symbol
Follow us

|

Updated on: Aug 23, 2022 | 10:13 PM

శివసేనలో(Shiv Sena) చీలికతో ఆ పార్టీ గుర్తు కోసం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ వర్గం(Eknath Shinde), మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేశారు. ఈ నెల 25న రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుంది. అప్పటి వరకు శివసేన పార్టీ గుర్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. పార్టీ ఫిరాయింపులు, విలీనం, చీలిక, అనర్హతలకు సంబంధించిన అంశాలపై థాక్రే, షిండే వర్గాలు ఈ పిటిషన్లు వేశాయి.

వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే అసలైన శివసేన పార్టీ తమదేనంటూ షిండే వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. పార్టీపై కంట్రోల్‌ను, విల్లు, బాణం గుర్తును తమకే కేటాయించాలని కోరింది. అయితే దీన్ని థాక్రే వర్గం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కానందున, షిండే వినతిపై చర్యలు తీసుకోవద్దని కోరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. విల్లు, బాణం గుర్తు తమదేనని రుజువు చేసే డాక్యుమెంట్లను సమర్పించాలని షిండే, ఉద్ధవ్‌ వర్గాలకు సూచించింది.

శివసేన శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండు వర్గాలను కోరంది. దీంతో థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా తేలలేదు కాబట్టి షిండే వర్గం అర్జీపై ఈసీ చర్యలు తీసుకోకుండా ఆపాలని పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గతంలోనే విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి షిండే వర్గం వినతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

ఇవి కూడా చదవండి
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..