TN Fishermen Arrest: 55 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..

TN fishermen held by Sri Lankan Navy: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను

TN Fishermen Arrest: 55 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..
Tn Fishermen
Follow us

|

Updated on: Dec 20, 2021 | 11:45 AM

TN fishermen held by Sri Lankan Navy: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న 6 పడవలను సైతం స్వాధీనం చేసుకుంది. అనంతరం శ్రీలంక నావికాదళం వారిని కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లారు. ఈ వివరాలను తమిళనాడు మత్స్యశాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. రామేశ్వరం నుంచి వెళ్లిన 43 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి.. 6 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు.. శ్రీలంక నావికాదళం మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్లు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకోని రెండు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారతీయుల సంఖ్య 55 కి చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తమిళ జాలర్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేసింది. శ్రీలంక తీరుకు నిరసనగా మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అధికారులు చొరవతీసుకొని మత్స్యకారులను విడిపించాలని వారి కటుంబాలు కోరుతున్నాయి. కాగా.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల విడుదల కోసం శ్రీలంక అధికారులతో వెంటనే మాట్లాడాలని అభ్యర్థించాయి. తమిళనాడుకు చెందిన కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించారు.

కాగా.. రామేశ్వరం ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది జాలర్లు మరపడవల్లో శనివారం వేకువజామున సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. ఆదివారం వేకువజామున భారత్‌, శ్రీలంక దేశాల సముద్రజలాల సరిహద్దులో ఉన్న కచ్చాతీవు సమీపం నెడుదీవు వద్ద సుమారు జాలర్లు చేపలు పడుతుండగా 20 గస్తీ పడవలలో వచ్చిన శ్రీలంక నావికాదళం సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. తమ దేశపు సముద్రజలాల్లో అక్రమంగా చొరబడి చేపలు పడుతున్నారంటూ దాడికి దిగారు. ఈ ఘటనను చూసిన మిగతా జాలర్లంతా భయంతో స్వస్థలానికి తిరుగుముఖం పట్టారు. ఆదివారం ఉదయం రామేశ్వరం తీరం చేరుకున్న జాలర్లు శ్రీలంక నావికాదళం దాష్టీకం గురించి తెలపడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read:

Heroin Seized: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ. 400 కోట్లు విలువ ఉంటుందన్న అధికారులు

Warangal: హనుమకొండలో దారుణం.. దహన సంస్కారాలకు దారి ఇవ్వకపోవడంతో ఇంట్లోనే మృతదేహం..!

Latest Articles
ట్రైన్‌కి జీవిత కాలం ఎంతో తెలుసా? ఆ తర్వాత వాటిని ఎం చేస్తారంటే..
ట్రైన్‌కి జీవిత కాలం ఎంతో తెలుసా? ఆ తర్వాత వాటిని ఎం చేస్తారంటే..
30 ఏళ్లు దాటాకే పెళ్లి.. అది కూడా ఆ టైప్‌లో..
30 ఏళ్లు దాటాకే పెళ్లి.. అది కూడా ఆ టైప్‌లో..
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
లైవ్‌లో ఓవర్ యాక్షన్.. కట్‌చేస్తే.. ఒక మ్యాచ్ నుంచి సస్పెషన్
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్