AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యోతిష్యుని మాటలు నమ్మి భర్తను హత్య చేసిన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌

డ్రైవర్‌తో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌. తమిళనాడులో ఆల్యంగా వెలుగు చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..

జ్యోతిష్యుని మాటలు నమ్మి భర్తను హత్య చేసిన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌
SSI murdered her husband
Srilakshmi C
|

Updated on: Dec 27, 2022 | 4:42 PM

Share

డ్రైవర్‌తో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌. తమిళనాడులో ఆల్యంగా వెలుగు చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని సింగర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చిత్ర (47)కు, కల్లావికి చెందిన సెంథిల్‌ కుమార్‌ (48)తో చాలా ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సెంథిల్‌ కుమార్‌ కూడా పోలీసధికారే. ఐతే 2012లో ఓ కేసులో సెంధిల్‌ను విధుల నుంచి తొలగించారు. అనంతరం భార్య చిత్రతో విభేదాలు తలెత్తడంతో దంపతులిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో చిత్ర తన కారు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న సెంథిల్ భార్యను హెచ్చరించాడు. అయినా తీరుమార్చుకోని చిత్ర సంబంధాన్ని కొనసాగించింది.

అనంతరం చిత్ర జ్యోతిష్యురాలైన సరోజను కలిసి తన సమస్యను చెప్పుకొంది. దీంతో తన భర్తను చంపాలని చిత్రకు సూచించింది సరోజ. అందుకు రూ.10 లక్షల సుపారీతో రౌడీలను సైతం మాట్లాడింది. పథకం ప్రకారం సెప్టెంబర్ 16న చిత్ర తన భర్తను రౌడీల సాయంతో హత్య చేసి మృతదేహాన్ని ఉత్తంగరైలోని బావిలో పడేసింది. అక్టోబర్ 31న తన కుమారుడు కనిపించడం లేదంటూ సెంథిల్ తల్లి బక్కియం కృష్ణగిరి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. నవంబర్ రెండో వారంలో ఈ కేసును కల్లావి పోలీసులకు బదిలీ చేశారు.

విచారణలో భాగంగా చిత్ర, సెంథిల్‌ దంపతుల కుమారుడు కమల్‌రాజ్‌ (19)ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. సెంథిల్‌ను హత్య చేసినట్లు కృష్ణగిరి మెజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడు. విచారన అనంతరం సెంథిల్ మృతదేహాన్ని బావిలో నుంచి పోలీసులు బయటకు తీశారు. నిందితులు చిత్ర (47)తోపాటు ఎం సరోజ (37), విజయ కుమార్ (33), రాజా పాండియలను పోలీసులు శనివారం రాత్రి (డిసెంబర్‌ 24) అరెస్టు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురి కోసం ఉత్తంగరై పోలీస్ ఇన్‌స్పెక్టర్ పార్థిబన్ నేతృత్వంలో 15 మంది పోలీసులు మూడు బృందాలుగా గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..