AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పరీక్షా హాల్లో కనిపించని టీచర్స్‌.. స్మార్ట్‌ టీవీలో పాటలతో ఎంజాయ్‌ చేస్తున్న స్టూడెంట్స్..

వీడియోలోని విద్యార్థులు మే 8, 2023న 11వ తరగతి బయాలజీ పేపర్ రాస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిందని తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారులు వెంటనే విచారణ బాధ్యతను విద్యాశాఖాధికారులకు అప్పగించారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.

Watch: పరీక్షా హాల్లో కనిపించని టీచర్స్‌.. స్మార్ట్‌ టీవీలో పాటలతో ఎంజాయ్‌ చేస్తున్న స్టూడెంట్స్..
Tv And Children
Jyothi Gadda
|

Updated on: May 14, 2023 | 10:00 AM

Share

ఎగ్జామ్‌ హాల్లో విద్యార్థులు పరీక్ష రాస్తుండగా, స్మార్ట్‌ టీవీ స్టార్ట్‌ అయింది. పిల్లలు సీరియస్‌గా ఎగ్జామ్‌ రాస్తుండగా, టీవీలో హెరెత్తించే సినిమా పాటలు ప్లే అవుతున్నాయి. దాంతో విద్యార్థులంతా పరీక్ష రాయటం వదిలేసిన టీవీ ముందు చేరిపోయారు. పైగా చేతిలో మొబైల్ ఫోన్స్‌ తీసుకుని ఆ దృశ్యాలను రికార్డ్‌ చేస్తున్నారు. పరీక్షా సెంటర్‌లో టీవీ చూడటం, పైగా స్మార్ట్‌ ఫోన్‌ దగ్గరపెట్టుకుని పరీక్షలు రాస్తున్నట్టుగా కనిపించే షాకింగ్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే, ఈ ఘటన బీహార్‌లో జరిగినట్టుగా తెలిసింది. ఈ వీడియోలో కొంతమంది పిల్లలు పరీక్షలు రాయడం, అదే సమయంలో తరగతి గదిలోని టీవీలో పవన్ సింగ్ పాట ప్లే చేయబడింది. ఈ వీడియో బీహార్ విద్యావ్యవస్థపై మరోసారి ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోది. ఆశ్చర్యకరంగా, పిల్లలు పేపర్ రాస్తున్న సమయంలో తరగతి గదిలో ఉపాధ్యాయులెవరూ కనిపించడం లేదు.

అందిన సమాచారం ప్రకారం, వీడియోలోని విద్యార్థులు మే 8, 2023న 11వ తరగతి బయాలజీ పేపర్ రాస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిందని తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారులు వెంటనే విచారణ బాధ్యతను ఇస్లాంపూర్ గ్రూపు విద్యాశాఖాధికారులకు అప్పగించారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్‌గా మారటంతో నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కొన్ని ఫన్నీ రియాక్షన్‌లు కూడా ఉన్నాయి. @AnuragCaddha అనే వినియోగదారు ఇలా వ్రాశాడు, “క్లాస్‌లో ఒక వైపు బయాలజీ పేపర్‌, మరియు మరొక వైపు టీవీలో పవన్ సింగ్ పాటలు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జిల్లా రాష్ట్రం. మరొకరు ఇలా వ్రాశారు. బీహార్‌లోని సుపరిపాలన కొన్నిసార్లు రైల్వే స్టేషన్ టీవీ స్క్రీన్‌లపై అశ్లీల వీడియోలను చూపిస్తుందని కొందరు గుర్తు చేస్తూ కామెంట్‌ చేశారు. పిల్లలు పరీక్షల ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఇప్పుడు పాటలు పాడుతున్నారు. అందులో తప్పేముంది? అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..