AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ పచ్చి అవకాశవాది.. బీజేపీ మండిపాటు

భారత అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేసే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ వదులుకోదని బీజేపీ మండిపడింది. జమ్మూ కాశ్మీర్ లో కేంద్రం గతంలో విధించిన ఆంక్షలను ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ఇద్దరు ఎంపీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ఈ తీర్మానం హర్షించదగినదని ఆయన వ్యాఖ్యానించారు. (ఇండియన్ అమెరికన్ డెమొక్రాట్ ప్రమీలా జయపాల్, రిపబ్లికన్ స్టీవ్ వాట్ కిన్స్ సంయుక్తంగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు). కాగా-శశిథరూర్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ శోభా […]

కాంగ్రెస్ పార్టీ పచ్చి అవకాశవాది.. బీజేపీ మండిపాటు
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 09, 2019 | 3:14 PM

Share

భారత అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేసే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ వదులుకోదని బీజేపీ మండిపడింది. జమ్మూ కాశ్మీర్ లో కేంద్రం గతంలో విధించిన ఆంక్షలను ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ఇద్దరు ఎంపీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ఈ తీర్మానం హర్షించదగినదని ఆయన వ్యాఖ్యానించారు. (ఇండియన్ అమెరికన్ డెమొక్రాట్ ప్రమీలా జయపాల్, రిపబ్లికన్ స్టీవ్ వాట్ కిన్స్ సంయుక్తంగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు). కాగా-శశిథరూర్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ శోభా కరంద్ లాజే తీవ్రంగా దుయ్యబట్టారు. భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని ప్రశంసించడం మీకు సిగ్గుగా లేదూ అని ఆమె ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆంక్షలు విధించిన తరువాత మొదటిసారిగా ఆ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలావరకు తగ్గాయని, పైగా ప్రజలు కూడా తాము సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్నీ రాజకీయం చేసి భారత ప్రతిష్టను దిగజార్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదన్నారు. దక్షిణ బెంగుళూరుకు చెందిన ఎంపీ తేజస్వి సూర్య కూడా థరూర్ ను విమర్శించారు.

కాశ్మీర్లో ఇంకా పలుచోట్ల ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని, వాటిని ఎత్తివేయాలని ప్రమీలా జయపాల్, స్టీవ్ వాట్ కిన్స్ తమ తీర్మానంలో కోరారు. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల పరిశీలకులను ఆ రాష్ట్రంలోనికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. పైగా ఆంక్షల నేపథ్యంలో కాశ్మీర్ ప్రజలు స్వేఛ్చగా తిరగలేకపోతున్నారని వారు పేర్కొన్నారు.