LAC Controversy: వక్రబుద్ది మారని డ్రాగన్ కంత్రీ(ట్రీ).. ప్యాంగోంగ్ సరస్సు వద్ద అక్రమ రహదారి నిర్మాణం!

ప్రపంచం మొత్తం వేలెత్తి చూపుతున్నా.. డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి మారడం లేదు. తాజాగా చైనా మరోసారి తన వికృత చేష్టలను ప్రదర్శించింది.

LAC Controversy: వక్రబుద్ది మారని డ్రాగన్ కంత్రీ(ట్రీ).. ప్యాంగోంగ్ సరస్సు వద్ద అక్రమ రహదారి నిర్మాణం!
Pangong Tso Bridge
Follow us

|

Updated on: May 03, 2022 | 11:33 AM

India-China Border Controversy: ప్రపంచం మొత్తం వేలెత్తి చూపుతున్నా.. డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి మారడం లేదు. తాజాగా చైనా మరోసారి తన వికృత చేష్టలను ప్రదర్శించింది. వాస్తవ నియంత్రణ రేఖ ( LAC ) సమీపంలోని పాంగాంగ్ త్సో సరస్సు దక్షిణ ఒడ్డున కొత్త వంతెన చుట్టూ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందుకు సంబంధించి శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. అయితే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వద్ద అందుబాటులో ఉన్న ఫోటోలు చాలా తక్కువ రిజల్యూషన్‌ను కలిగి ఉన్నందున, కొత్త నిర్మాణం స్థితి స్పష్టంగా కనిపించలేదు. కొత్త మార్పులను ట్విట్టర్ వినియోగదారు డామియన్ సైమన్ సోమవారం గుర్తించారు.

ఏప్రిల్ చివరి రెండు వారాల్లో కొత్త నిర్మాణం గణనీయంగా జరిగిందని ఉపగ్రహ చిత్రాలు నిర్ధారిస్తున్నాయి. గతంలో చైనా ఈ వంతెన నిర్మాణాన్ని ‘అక్రమం’గా నిర్మించిందని భారత ప్రభుత్వం పేర్కొంది. అప్పటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పాంగోంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని ఆయన అన్నారు. 1962 నుంచి చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ అక్రమ ఆక్రమణను భారత ప్రభుత్వం ఎన్నడూ అంగీకరించలేదు.

ఆగస్టు 2020లో భారత సాయుధ బలగాలు కీలక స్థానాలపై నియంత్రణ సాధించడం ద్వారా ఆకస్మిక ఆపరేషన్ నిర్వహించింది, ఈ పరిస్థితిని నివారించడానికి చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కొత్త చైనీస్ మౌలిక సదుపాయాలు ఒక ముఖ్యమైన భాగం. దీని ద్వారా మొత్తం అక్సాయ్ చిన్ ప్రాంతంలో భారత్‌కు వ్యతిరేకంగా చైనా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది.. గత ఏడాది సెప్టెంబర్‌లో సరస్సు ఉత్తర ఒడ్డు నుంచి వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో తేలింది.

కార్ప్స్ కమాండర్ స్థాయిలో అనేక రౌండ్ల సైనిక చర్చలు జరిగినప్పటికీ.. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి స్టేట్ కౌన్సెలర్ వాంగ్ యీ ఢిల్లీకి వచ్చినప్పటికీ, తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తత పూర్తిగా తగ్గలేదు. ఈ ఏడాది చివర్లో చైనా నిర్వహించనున్న బ్రెజిల్-రష్యా-భారత్-చైనా-దక్షిణాఫ్రికా (బ్రిక్స్) సమావేశంలో భారత్ పాల్గొనే అవకాశం ఉంది. ఈసారి సమావేశం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం జూన్ నెలాఖరులో నిర్వహించవచ్చు. ఆన్‌లైన్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపడి ఉంది.

Read Also… Rahul vs KCR: ఓయూలోకి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ.. భావప్రకటన స్వేచ్ఛను సర్కార్ కాలరాస్తుందా?

Latest Articles
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.