AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. మీకు ఎంత వస్తుందో తెలుసా.?

2023 జనవరి నుంచి ఈ వేతనాల పెంపు అమలులోకి వస్తుందని సమాచారం.. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 48 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. మీకు ఎంత వస్తుందో తెలుసా.?
Government Employees
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 06, 2023 | 9:37 PM

ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ రివిజన్‌ 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చిలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం జీతాలు పెంచబోతున్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల డిసెంబరు నెలకు సంబంధించిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక సంఖ్యలను విడుదల చేసింది. దాని ఆధారంగా వేతనాల పెంపు 3 శాతం ఉంటుందని అంచనా. గత ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) సంఖ్య క్రమంగా పెరిగింది. డిసెంబర్‌లో తగ్గుముఖం పట్టింది. గతంలో అక్టోబర్, నవంబర్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇది సెప్టెంబరులో 131.3, ఆగస్టులో 130.2 మరియు జూలైలో 129.9. అక్టోబర్, నవంబర్‌లో 132.5 పాయింట్లు ఉండగా, డిసెంబర్‌లో 132.3 పాయింట్లకు క్షీణించింది.

ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో హోలీ పండుగకు ముందే ఉద్యోగుల జీతాల పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. 2023 జనవరి నుంచి ఈ వేతనాల పెంపు అమలులోకి వస్తుందని కూడా చెబుతున్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 48 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

DA బకాయిల విడుదల కోసం లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలుగా ఎదురు చూస్తున్నారు. అయితే మరో విధంగానూ వారు లబ్ధి పొందనున్నట్లు వెల్లడించింది. ఈ మార్చిలో డియర్ నెస్ అలవెన్స్‌ (DA)ను కూడా కేంద్రం పెంచే అవకాశం ఉందని గతంలో నివేదికలు వచ్చాయి. అదే జరిగితే జనవరి 1 నుంచి పెరిగిన DAను లెక్కిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..