Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసీదులో పూజలు చేస్తే మగపిల్లవాడు పుడతాడు..! 8 నెలల గర్భిణిని నమ్మించిన భర్త..చివరకు ఇలా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఉస్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి 10 నెలల క్రితం హీనా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే అతని హీనా గర్భం దాల్చింది. అయితే,

మసీదులో పూజలు చేస్తే మగపిల్లవాడు పుడతాడు..! 8 నెలల గర్భిణిని నమ్మించిన భర్త..చివరకు ఇలా..
Arrest
Follow us
Jyothi Gadda

|

Updated on: May 24, 2022 | 4:21 PM

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇమామ్ తన 8 నెలల గర్భవతి అయిన భార్యను పూజల పేరుతో నమ్మించి అంతం చేశాడు. మసీదులో పూజలు చేయాలని చెప్ప అదే మసీదు పైకప్పుపై నుండి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రికి తరలించే లోపుగానే మృత్యువాత పడింది. ఇమామ్ కూడా మసీదుపై నుండి కిందపడిపోయినట్టుగా ఒంటినిండా కట్లుకట్టుకుని, ఏదో శక్తి తమను అంతం చేయాలనుకుంది అంటూ.. అందరికీ కట్టుకథలు చెప్పాడు. ఏ కానీ, ఎట్టకేలకు అసలు విషయం కనిపెట్టిన పోలీసులు ఇమామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఇక్కడ జరిగిందేంటీ.. కథలో ట్విస్ట్‌ ఏంటి అంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఉస్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి 10 నెలల క్రితం హీనా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే అతని హీనా గర్భం దాల్చింది. అయితే, భార్య కడుపులో పెరుగుతున్నది ఆడిపల్ల అని తెలుసుకన్న ఉస్మాన్‌, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం మే 12వ తారీఖున ఆమెతో మసీదులో పూజలు చేయించాలని వెంటతీసుకెళ్లాడు. అలా చేస్తే మగపిల్లలు పుడతారని హీనాను నమ్మించాడు. భర్త మాటలు నమ్మిన హీనా అతని వెంట మసీదుకు వెళ్లగా, భార్యతో అక్కడ కొన్ని పూజలు చేయించాడు. అనంతరం ఆమెను బాల్కనీలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేశాడు. ఎనిమిది నెలల గర్భవతి అయిన హీనా హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపునే మరణించింది. తాను కూడా బాల్కనీ నుంచి పడిపోయానని చెప్పి ఉస్మాన్ కట్లు కట్టించుకున్నాడు. అనంతరం ఏదో శక్తి తనను, తన భార్యను బాల్కనీ నుంచి తోసేసిందని బంధువులకు చెప్పాడు. భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు.

అయితే హీనా తల్లి తన కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. తన కుమార్తె మరణంలో తన అల్లుడి పాత్రపై అనుమానాలు లేవనెత్తింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మే22న హీనా మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీశారు. హీనా శరీరం, మెడ, ముక్కు, చెవులపై గాయాలు కలిగి ఉండటం పోలీసులు గుర్తించారు..దీంతో పోలీసులు హీనా మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.