AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ గురించి సంచలన కామెంట్ చేసిన సాధ్వీ ప్రజ్ఞా

నిత్యం ఏదో సంచలన కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలిచే సాధ్వీ ప్రజ్ఞా సింగ్.. మరోసారి తన నోటికి పనిచెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా బీజేపీ క్యాడర్ ఈ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్నారు. కానీ భోపాల్ ఎంపీ, బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అయితే సోమవారం భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

గాంధీ గురించి సంచలన కామెంట్ చేసిన సాధ్వీ ప్రజ్ఞా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 22, 2019 | 2:03 AM

Share

నిత్యం ఏదో సంచలన కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలిచే సాధ్వీ ప్రజ్ఞా సింగ్.. మరోసారి తన నోటికి పనిచెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా బీజేపీ క్యాడర్ ఈ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్నారు. కానీ భోపాల్ ఎంపీ, బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అయితే సోమవారం భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను సంకల్పయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదంటూ అక్కడి మీడియా ప్రశ్నించింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు విన్ని వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు గాంధీ జాతిపిత కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశం కన్న ఓ గొప్ప బిడ్డ అని.. అందుకే ఆయన్ను ప్రశంసిస్తామన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తామని.. ఇంతకు మించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సూటిగా సమాధానమిచ్చారు.

కాగా, ప్రజ్ఞాసింగ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గాంధీని హత్యచేసిన గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా వర్ణించారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం.. వివరణనివ్వాలని ఆదేశించింది. అయితే గాడ్సే వ్యాఖ్యలు ఆమెకు ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బంపర్ మెజార్టీతో విజయం సాధించారు.