Republic Day 2026 Highlights: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పరేడ్కే హైలెట్గా నిలిచిన విన్యాసాలు
77th Republic Day Parade Highlights in Telugu: 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ, వైమానిక దళం, నావికాదళం, సాంస్కృతిక శకటాలు, వివిధ ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ కవాతు , వేడుక జరుగుతుంది. కవాతు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

77th Republic Day Parade Highlights in Telugu: 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ, వైమానిక దళం, నావికాదళం, సాంస్కృతిక శకటాలు, వివిధ ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ కవాతు , వేడుక జరుగుతుంది. కవాతు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం జనవరి 26 (నేడు) నుండి ఎర్రకోట ప్రాంగణంలో ఆరు రోజుల జాతీయ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవం అయిన భారత్ పర్వ్ను నిర్వహించనుంది. దీనిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభిస్తారని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ పర్వ్ అనేది మంత్రిత్వ శాఖ ప్రధాన వార్షిక కార్యక్రమం. ఇది భారతదేశం గొప్ప సాంస్కృతిక, కళాత్మక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకుంటుంది.
LIVE NEWS & UPDATES
-
ముగిసిన వేడుకలు
ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గణతంత్ర దినోత్స వేడుకలు ముగిశాయి. వేడుకులు ముగిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్కు బయలుదేరారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా బయలుదేరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథులతో కలిసి రాష్ట్రపతి భవన్కు బయలుదేరారు.
-
ఆకట్టుకుంటున్న విన్యాసాలు
ఢిల్లీలో కర్తవ్యపథ్లో జరుగుతున్న గణతంత్ర దినోత్స వేడుకల్లో వివిధ శాఖటలు, విన్యాసాలు హైటెల్గా నిలుస్తున్నాయి. విన్యాసాలు ప్రతి ఒక్కరిని అబ్బుర పరుస్తున్నాయి.
-
-
NDRF శకటం
భుజ్ భూకంపం సంభవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గణతంత్ర దినోత్సవ కవాతులో హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) లను ప్రతిబింబించే శకటాలు ప్రదర్శించాయి. ఆ సమయంలో NDRF బృందం పౌరులకు ఎలా సహాయం చేసిందో ప్రదర్శిస్తుంది.
-
ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వాహనం
భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వాహనం అయిన హై మొబిలిటీ రికనైసెన్స్ వెహికల్ (HMRV) ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచారు. దీనిని మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసి 2023లో ప్రారంభించింది. ఇది మానవులు, వాహనాలు, తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లను గుర్తించగల యుద్ధభూమి నిఘా రాడార్తో పాటు రాడార్ బ్లైండ్ జోన్లను కవర్ చేయడానికి డ్రోన్లు, అధునాతన కమ్యూనికేషన్లు, యాంటీ-డ్రోన్ గన్లను కలిగి ఉంటుంది.
77th #RepublicDay🇮🇳 | High Mobility Reconnaissance Vehicle (HMRV), India’s first indigenously designed Armoured Light Specialist Vehicle, being showcased at the Kartavya Path in Delhi.
It is developed by Mahindra Defence Systems and commissioned in 2023. It is equipped with… pic.twitter.com/1I5k6yV64M
— ANI (@ANI) January 26, 2026
-
కవాతులో సిందూర్ ఫార్మేషన్
గణతంత్ర దినోత్సవ కవాతులో సిందూర్ ఫార్మేషన్ కూడా కనిపించింది. భారత వైమానిక దళం నుండి నలుగురు అధికారులు (ఒక గ్రూప్ కమాండర్, ముగ్గురు సూపర్ న్యూమరరీ అధికారులు),144 మంది ఎయిర్మెన్ పాల్గొన్నారు.
-
-
ఢిల్లీలో విధుల్లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం
ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలక విధుల్లో యూరోపియన్ యూనియన్ (EU) ప్రతినిధి బృందం పాల్గొంది. యూరోపియన్ యూనియన్ (EU) సైనిక బృందానికి కల్నల్ ఫ్రెడెరిక్ సైమన్ స్ప్రూట్ నాయకత్వం వహిస్తారు. అతను యూరోపియన్ యూనియన్ మిలిటరీ స్టాఫ్ (EUMS) డైరెక్టర్ జనరల్ తరపున ఒక ఉత్సవ జిప్సీలో స్వారీ చేస్తాడు.
77th #RepublicDay🇮🇳 | The European Union (EU) contingent at the Kartavya Path in Delhi
The European Union (EU) military representation is led by Colonel Frederik Simon Spruijt, acting on behalf of the Director General of the European Union Military Staff (EUMS), on board a… pic.twitter.com/DI6gvXNGuY
— ANI (@ANI) January 26, 2026
-
శుభాన్షు శుక్లాకు అశోక్ చక్ర అవార్డును అందించిన రాష్ట్రపతి
ఢిల్లీ కర్తవ్యపథ్ గణతంత్ర దినోత్స వేడుకల్లో భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ వ్యోమగామి, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం ‘అశోక చక్ర’ వరించనుంది. ఈ అశోక చక్రను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అందించారు.
-
గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు
ఢిల్లీలో గణతంత్ర దినోఓత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్లతో కలిసి హాజరయ్యారు.
#WATCH | President Droupadi Murmu steps out of the Rashtrapati Bhavan with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen.
The two foreign dignitaries are the Chief Guests at the 77th #RepublicDay… pic.twitter.com/juZ8GYHgDw
— ANI (@ANI) January 26, 2026
-
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ
ఢిల్లీలో కర్తవ్యపథ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. వందేమాతరం థీమ్తో వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ రిపబ్లిక్ వేడుకలకు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కార్తవ్యపథ్ దగ్గర 6 కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేశారు.
- Modi
-
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్..
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, “గణతంత్ర దినోత్సవం సందర్భంగా, దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
-
రాజ్యాంగాన్ని రక్షించడం అంటే భారత గణతంత్రాన్ని రక్షించడమే – రాహుల్ గాంధీ
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఆయన ఇలా రాశారు. “గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా దేశస్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన రాజ్యాంగం ప్రతి భారతీయుడి గొప్ప ఆయుధం. అది మన గొంతు, మన హక్కుల కవచం అని అన్నారు.
सभी देशवासियों को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं।
हमारा संविधान हर भारतीय का सबसे बड़ा हथियार है – यही हमारी आवाज़ है, हमारे अधिकारों का सुरक्षा-कवच।
इसी की मज़बूत नींव पर हमारा गणतंत्र खड़ा है जो समानता और सौहार्द से ही सशक्त होगा।
संविधान की रक्षा ही, भारतीय गणतंत्र की… pic.twitter.com/rrkVJlEkRG
— Rahul Gandhi (@RahulGandhi) January 26, 2026
-
పరేడ్ గ్రౌండ్ లో
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
-
తెలుగు రాష్ట్రాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో గవర్నర్ జెండాను ఆవిష్కరించారు. అటు ఏపీలో కూడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
-
బీజేపీ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు నితిన్ నవీన్ జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి, అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.
-
స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి లేదు, ఐక్యతే బలం: మోదీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియోను షేర్ చేశారు. స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం మన స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు శక్తివంతమైన చిహ్నం అని ఆయన అన్నారు. ఈ పండుగ మనకు కొత్త శక్తిని, దేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఐక్యంగా ముందుకు సాగడానికి ప్రేరణను ఇస్తుంది. ఆయన ఒక శ్లోకాన్ని కూడా పంచుకున్నారు.
गणतंत्र दिवस हमारी स्वतंत्रता, संविधान और लोकतांत्रिक मूल्यों का सशक्त प्रतीक है। यह पर्व हमें एकजुट होकर राष्ट्र निर्माण के संकल्प के साथ आगे बढ़ने की नई ऊर्जा और प्रेरणा देता है।
पारतन्त्र्याभिभूतस्य देशस्याभ्युदयः कुतः।
अतः स्वातन्त्र्यमाप्तव्यमैक्यं स्वातन्त्र्यसाधनम्॥ pic.twitter.com/i0XjjgL38x
— Narendra Modi (@narendramodi) January 26, 2026
-
ముఖ్యమంత్రి నివాసంలో జెండా
రాజస్థాన్: ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ముఖ్యమంత్రి నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ జైపూర్లోని ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
#WATCH | Rajasthan CM Bhajanlal Sharma unfurls the National Flag at the CM residence in Jaipur, on #RepublicDay pic.twitter.com/57UZS5NEZR
— ANI (@ANI) January 26, 2026
-
అవార్డులు
గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది . ఈ సంవత్సరం, వివిధ రంగాలలో అత్యుత్తమ కృషి చేసినందుకు దేశవ్యాప్తంగా 131 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో ఐదుగురు పద్మ విభూషణ్, 13 మంది పద్మ భూషణ్, మరియు 113 మంది పద్మశ్రీలు ఉన్నారు.
-
ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు
దేశవ్యాప్తంగా నేడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్య పథంలో జరిగే కవాతుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
#WATCH | Preparation visuals from Kartavya Path ahead of the 77th Republic Day Parade. pic.twitter.com/JitWlc9CJ1
— ANI (@ANI) January 26, 2026
-
నా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దేశ ప్రజలకు హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. “నా తోటి పౌరులందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ గర్వం, గౌరవం, కీర్తికి ప్రతీక అయిన ఈ గొప్ప జాతీయ పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలి. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మీ సంకల్పం మరింత బలపడాలి అంటూ ట్వీట్ చేశారు.
सभी देशवासियों को गणतंत्र दिवस की बहुत-बहुत बधाई। भारत की आन-बान और शान का प्रतीक यह राष्ट्रीय महापर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। विकसित भारत का संकल्प और अधिक सुदृढ़ हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) January 26, 2026
-
ఎర్రకోట ప్రాంగణంలో వేడుకలు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం జనవరి 26 (నేడు) నుండి ఎర్రకోట ప్రాంగణంలో ఆరు రోజుల జాతీయ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవం అయిన భారత్ పర్వ్ను నిర్వహించనుంది. దీనిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభిస్తారని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Published On - Jan 26,2026 6:51 AM





