AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎకనమిక్ సర్వే లో జీడీపీ వృద్ది రేటు ఎంత ?

2019-20 సంవత్సరానికి స్థూల దేశీయ వృద్ది (జీడీపీ) రేటును 7 శాతం గా ఆర్ధిక సర్వే పేర్కొంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. ఈ సర్వే ను గురువారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకోసం కార్మిక చట్టాలను డీరెగ్యులరైజ్ చేయాలని, పబ్లిక్ సెక్టార్ తో చేతులు కలిపి ప్రయివేటు ఇన్వెస్టిమెంట్లను సమీకరించాలని ఈ సర్వే సూచించింది. చీఫ్ […]

ఎకనమిక్ సర్వే లో జీడీపీ వృద్ది  రేటు ఎంత ?
Pardhasaradhi Peri
|

Updated on: Jul 04, 2019 | 4:44 PM

Share

2019-20 సంవత్సరానికి స్థూల దేశీయ వృద్ది (జీడీపీ) రేటును 7 శాతం గా ఆర్ధిక సర్వే పేర్కొంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. ఈ సర్వే ను గురువారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకోసం కార్మిక చట్టాలను డీరెగ్యులరైజ్ చేయాలని, పబ్లిక్ సెక్టార్ తో చేతులు కలిపి ప్రయివేటు ఇన్వెస్టిమెంట్లను సమీకరించాలని ఈ సర్వే సూచించింది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ రూపొందించిన ఈ ఎకనామిక్ సర్వే ..తిరిగి ఎన్నికైన మోదీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మొట్టమొదటిది. దీని అంచనా ప్రకారం.. జీడీపీ 7 శాతం వృద్దినే చేరుకుంటే అది చైనాను అధిగమించి వాల్డ్ లోనే అతి పెద్ద ఎకానమీని సాధించిన దేశంగా ఇండియా ఎదగడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రాల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పన్నుల వసూళ్లు తగ్గినందున.. ఆర్ధిక వృద్ది కూడా మందగించింది.. ఫలితంగా ఈ దేశం పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది.. అయితే బ్యాంకు రుణాలు, కన్స్యూమర్ డిమాండ్ మెరుగు పడిన పక్షంలో రాబోయే నెలల్లో ఇన్వెస్టిమెంట్ రేట్లు పెరగవచ్చునని, దాంతో పరిస్థితి బెటర్ అన్న చందంగా ఉంటుందని ఈ సర్వే అభిప్రాయపడింది. కాగా-ఈ ఎకనామిక్ సర్వేపై స్పందించిన ప్రధాని మోదీ.. ఇండియా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఆర్ధికంగా పుంజుకునేందుకు రోడ్ మ్యాప్ గా ఈ నివేదిక ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు. సామాజిక రంగంలో అభివృధ్ది, టెక్నాలజీ అడాప్షన్, ఎనర్జీ సెక్యూరిటీ… ఈ మూడూ ప్రధానంగా ఈ ‘ విజన్ ‘ కు తోడ్పడతాయని ఆయన అన్నారు. అంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింత అభివృధ్ది పరచుకుని.. ఇంధనం తదితర రంగాల్లో పురోగతి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన వివరించారు. ఆర్ధిక శాఖ వెబ్ సైట్ ప్రచురించిన డాక్యుమెంటును మోదీ ఈ ట్వీట్ కు జత చేశారు. 2020 లో ఆర్ధిక వృద్ది 7 శాతానికి పెరగగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సూక్ష్మ స్థాయి పరిశీలనలు, కృషి గతంలో మాదిరే కొనసాగుతాయని, అందువల్ల 2019-20 లో ఎకానమీ వృద్ది సాధ్యమేనని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ప్రస్తావించిన అంశాన్ని అయన గుర్తు చేశారు. దేశంలో అనేక చోట్ల వర్షపాతం తగ్గిన ఫలితంగా వ్యవసాయ రంగ పురోగతి కూడా తగ్గిందని, ఫలితంగా ఆదాయం పై దీని ప్రభావం పడి.. సుమారు 15 శాతం రెవెన్యూ తగ్గుదల కనిపించిందని ఈ సర్వే పేర్కొంది. గ్రామీణ ‘ కష్టాలు ‘ మొదలయ్యాయి.. రైతులు దిగాలు పడుతున్నారు. అందువల్ల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టాల్సివచ్చింది… అని ఈ నివేదిక తెలిపింది. అయితే బ్యాంకింగ్ సంస్కరణలు, తదితర చర్యల ద్వారా పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చునన్న ఆశాభావాన్ని ఆర్ధిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం