AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం: రైలు ఇంజిన్‌ – బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి.. షాకింగ్‌ వీడియో వైరల్‌

మృతుడు పోర్టర్‌ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దారుణం: రైలు ఇంజిన్‌ - బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Railway Worker
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2024 | 5:33 PM

Share

ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రం బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్‌-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. నవంబర్‌ 9న జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కప్లింగ్‌ విడదీస్తున్న సమయంలో ఇంజిన్‌ ఒక్కసారిగా వెనక్కురావడంతో అక్కడే ఇరుక్కుపోయి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కాగా, ఘటనానంతరం లోకోపైలట్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

మృతుడు సోన్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్‌లో పనిచేస్తున్న పోర్టర్‌ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..