AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. కేంద్రం తీరుపై మండిపడ్డ సీఏం కేజ్రీవాల్..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అక్టోబర్7 (శుక్రవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశ రాజధాని, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని..

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. కేంద్రం తీరుపై మండిపడ్డ సీఏం కేజ్రీవాల్..
Enforcement Directorate
Amarnadh Daneti
|

Updated on: Oct 07, 2022 | 11:16 AM

Share

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అక్టోబర్7 (శుక్రవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశ రాజధాని, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు, డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంలో అతకతవకలు జరిగాయన్న ఆరోపణలతో అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన నేపథ్యంలో 2021 నవంబర్ 17 నుంచి అమలులోకి తెచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఈ ఏడాది జూలైలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, కూకట్ పల్లితో పాటు మరో రెండు చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఢిల్లీ మద్యం కుభకోణంలో అక్రమాలపై ఈడీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈడీ దాడుల నేపథ్యంలో మరోసారి ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డర్టీ పాలిటిక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 3 నెలల నుండి 500 కంటే ఎక్కువ దాడులు చేశారని, 300 కంటే ఎక్కువ మందిని విచారించారని, ఇందుకోసం సిబిఐ, ఈడి అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారని విమర్శించారు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నా ఎటువంటి ఆధారాలు కనుగొనలేదని, ఎందుకంటే మద్యం పాలసీలో ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని కేజ్రీవాల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇంత మంది అధికారుల సమయాన్ని నీచ రాజకీయాల కోసం వృధా చేస్తున్నారంటూ కేంద్రప్రభుత్వ వైఖరిపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇలాంటి దేశం ఎలా పురోగమిస్తుందంటూ ప్రశ్నించారు.

ఇలా ఉండగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఈ విషయం ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే ఎంతో మందిని విచారించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కొంతమంది ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న బ్యూరోక్రాట్‌లను నిందితులుగా పేర్కొన్న సీబీఐ, ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు మద్యం కొనుగోలుదారులను ఆకర్షించడానికి రిటైలర్లు పెద్ద డిస్కౌంట్లను అందించే విధానంలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపించగా.. అవినీతిని అరికట్టడమే తమ విధానామని, అందుకే కొత్త పాలసీ తీసుకొచ్చామని, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే అనేక సార్లు దాడులు నిర్వహించిన దర్యాప్తు సంస్థలు మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుని గత వారం అరెస్టు చేసింది. ఆప్ కమ్యూనికేషన్స్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత సమీర్ మహేంద్రుని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ