AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM’s YUVA: యువ రచయితలకు ప్రోత్సాహం.. సరికొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ..

PM's YUVA: 30 ఏళ్ల లోపు యువ రచయితలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘పిఎం యువా’ పథకానికి శ్రీకారం చుట్టింది.

PM's YUVA: యువ రచయితలకు ప్రోత్సాహం.. సరికొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ..
Pm Modi
Shiva Prajapati
| Edited By: Phani CH|

Updated on: Jun 09, 2021 | 8:30 AM

Share

PM’s YUVA: 30 ఏళ్ల లోపు యువ రచయితలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘పిఎం యువా’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఔత్సాహిక యువ రచయితలు తమ పుస్తకాన్ని రాయడానికి, 2022 నాటికి ప్రచురించడానికి ఆరు నెలల పాటు రూ. 50 వేల స్టైఫండ్‌ను అందిస్తోంది.

ఈ పథకానికి ఎంపిక కావాలంటే అభ్యర్థులు మొదట దేశవ్యాప్త పోటీలో పాల్గొనవలసి ఉంటుంది. ఇప్పటికే ఎంట్రీలు ప్రారంభమవగా.. పోటీలు జూలై 31న ముగియనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 5,000 పదాలతో కూడిన మాన్యూవల్ స్క్రిప్ట్‌ను mygov.in లో సమర్పించాల్సి ఉంటుంది. అలా వచ్చిన వాటిలో దేశవ్యాప్తంగా మొత్తం 75 ఎంట్రీలు ఎంపిక చేయబడతాయి. విజేతలను ఆగస్టు 15, 2021.. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రకటిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. మొదట, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా రెండు వారాలపాటు రచయితల ఆన్‌లైన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఇద్దరు ప్రముఖ రచయితలు లేదా సలహాదారుల ద్వారా శిక్షణ పొందుతారు. ఆ తర్వాత రచయితలకు రెండు వారాలపాటు ఎన్‌బిటి నిర్వహించిన జాతీయ శిబిరాల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది.

లిటరరీ ఫెస్టివల్స్, బుక్ ఫెయిర్స్, వర్చువల్ బుక్ ఫెయిర్, కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ వంటి వివిధ అంతర్జాతీయ కార్యక్రమాలలో పరస్పర చర్యల ద్వారా యువ రచయితలు తమ అవగాహనను మరింత పెంచుకునేందుకు అవకాశం ఉంది. అలాగే వారి నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తారు. మెంటర్‌షిప్ ముగింపులో.. అభ్యర్థులకు ఏకీకృత మొత్తం లభిస్తుంది రూ .3 లక్షలు(నెలకు రూ .50,000).

మెంటర్‌షిప్ ప్రోగ్రాం ఫలితంగా యువ రచయితలు రాసిన ఒక పుస్తకం లేదా పుస్తకాల శ్రేణిని ఎన్బిటి, ఇండియా ప్రచురిస్తుంది. ఈ పుస్తకం భారతీయ భాషల్లోకి అనువదించబడుతుంది. 10 శాతం రాయల్టీ సంబంధిత రచయితలకు చెల్లించబడుతుంది

‘యువా భారతదేశం@75 ప్రాజెక్ట్’ ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో ఒక భాగంగా చేపడుతున్నారు. అభ్యర్థులు జాతీయ ఉద్యమం, స్వాతంత్య్ర సమరయోధులు వంటి ఇతివృత్తాలపై రచనలు చేస్తారు. స్వాతంత్ర్య సమరయోధుల గురించి, స్వేచ్ఛతో సంబంధం ఉన్న సంఘటనలకు సంబంధించి.. భారత స్వాతంత్ర్య పోరాట వీరులకు నివాళిగా జనవరిలో తన మాన్ కీ బాత్ సందర్భంగా రాయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

Also read:

IND vs SRL: ఇంగ్లండ్ పర్యటనలో వారు బిజీ.. శ్రీలంక పర్యటన కోసం వీరు బిజీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Error 503: ఓ గంటపాటు ఇంటర్‌నెట్ డౌన్.. అంతరాయంకు చింతిస్తూ వెబ్ పేజ్‌లో 503… ఎందుకో తెలుసా..