AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

ప్రధాని నరేంద్ర మోదీని తొలి 'లతా దీనానాథ్‌ మంగేష్కర్‌' (Lata Mangeshkar Award)అవార్డుతో సత్కరించనున్నట్లు ఉషా మంగేష్కర్‌  ప్రకటించారు. ఏప్రిల్ 24న ముంబైలోని షణ్ముఖానంద్ హాల్‌లో అవార్డు ప్రదానోత్సవం..

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి 'లతా దీనానాథ్‌ మంగేష్కర్‌' అవార్డు..
Lata Mangeshkar Award
Sanjay Kasula
|

Updated on: Apr 12, 2022 | 2:10 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీని తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ (Lata Mangeshkar Award)అవార్డుతో సత్కరించనున్నట్లు ఉషా మంగేష్కర్‌  ప్రకటించారు. ఏప్రిల్ 24న ముంబైలోని షణ్ముఖానంద్ హాల్‌లో అవార్డు ప్రదానోత్సవం జరగనుందని తెలిపారు. దేశానికి చేసిన కృషికి, సేవలకు గాను ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అవార్డును అందజేయనున్నారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి వ్యక్తులతో పాటు ప్రతి రంగంలోని అనుభవజ్ఞులను ‘లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు’తో సత్కరించనున్నారు. అలాగే దీదీ గుర్తింపు తెలిసి ఆమె పేరుకు తగిన అవార్డు గ్రహీత ఎవరైనా ఉండాలని అన్నారు. అవార్డు ప్రదానోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని వెల్లడించారు. ఉషా మంగేష్కర్ చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ఇవ్వనున్నారు. అలాగే వినోదం, క్రీడలు, సామాజిక, రాజకీయ రంగాల్లో విశేషమైన విజయాలు సాధించిన వ్యక్తికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు.

15 సంవత్సరాల క్రితం మేము దీనానాథ్ మంగేష్కర్ కొత్త ఆసుపత్రిని నిర్మించాము. ఈ ఆసుపత్రిని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా లతా దీదీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆ తర్వాత లతాదిదీ, నరేంద్ర మోదీ మధ్య సోదరీ-సోదరీ బాంధవ్యం ఏర్పడిందని.. ఈ అవార్డును గుర్తుచేసుకున్నారు హృదయనాథ్ మంగేష్కర్.

ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..

Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..