AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంగా.. మొతేరా మైదానం.. ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

Narendra Modi Stadium at Motera: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మొతేరాలో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం...

Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంగా.. మొతేరా మైదానం.. ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2021 | 1:53 PM

Share

Narendra Modi Stadium at Motera: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మొతేరాలో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించారు. దీంతోపాటు అంతకుముందు ఉన్న ఈ స్టేడియం పేరును నరేంద్రమోదీ స్టేడియంగా పేరు మార్చారు. ఇప్పటివరకూ దీన్ని మొతేరా సర్ధార్ వల్లభభాయి పటేల్ స్టేడియంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ స్టేడియాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా సకలసౌకర్యాలతో రూపుదిద్దారు. లక్షా పది వేల సీటింగ్‌ సామర్థ్యంతో మొతేరాను అత్యాధునికంగా నిర్మించారు. కాగా.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీసీసీఐ కార్యదర్శి జై షా పాల్గొన్నారు.

కాగా.. ఈ మైదానంలో తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇంతపెద్ద స్టేడియంలో ఈ మ్యాచ్ గులాబీ బంతితో.. డేనైట్‌లో కొనసాగనుంది. ఈ మ్యాచ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర మంత్రులతో కలిసి కొంతసేపు వీక్షించనున్నారు.

ఇదిలాఉంటే.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో.. భారత్ – ఇంగ్లాండ్ జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో ఈ మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. అయితే డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read:

India vs England: అతిపెద్ద స్టేడియంలో పింక్‌ బాల్‌ టెస్ట్‌కు సర్వం సిద్ధం. నెట్స్‌లో కష్టపడుతున్న ప్లేయర్స్‌.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?