Delhi MCD: ఢిల్లీలోని మూడు కార్పొరేషన్ల విలీనం.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఏకీకరణ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన తర్వాత తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది.

Delhi MCD: ఢిల్లీలోని మూడు కార్పొరేషన్ల విలీనం.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల
Delhi Mcd
Follow us

|

Updated on: Apr 19, 2022 | 9:58 AM

Delhi MCD: ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఏకీకరణ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన తర్వాత తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే ఢిల్లీలోని మూడు కార్పొరేషన్ల ఏకీకరణ బిల్లు చట్టంగా మారింది. ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఏకీకరణ కోసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం (సవరణ) చట్టం 2022కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈమేరకు న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ రీటా వశిష్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసే చట్టం ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఎంసీడీ ఎన్నికలకు ఇది ముందడుగుగా కూడా భావిస్తున్నారు. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కన్సాలిడేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే, కార్పొరేషన్ల ఏకీకరణ బిల్లు తక్షణం అమల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు రాజధాని ఢిల్లీలో సౌత్, ఈస్ట్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉండదు. కానీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న జగదీష్ మామగాయ్.. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందని, ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2022 లోక్‌సభ, రాజ్యసభలో బడ్జెట్ సెషన్‌లో ఆమోదించడం జరిగింది. దీనికి ఇప్పుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం లభించింది.ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో ముగ్గురు మేయర్‌లు, ముగ్గురు కమిషనర్‌లకు బదులుగా ఒకరు మాత్రమే ఉంటారు.

2011లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు

2011 సంవత్సరంలో ఢిల్లీ శాసనసభలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించి ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీగా మార్చారు. అయితే, దివాళా తీసిన కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, మూడు కార్పొరేషన్లను ఏకం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏకీకరణ బిల్లు రావడానికి ఇదే కారణం. ఇకపై ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ సకాలంలో అందుతాయని, ఇందుకోసం సమ్మె చేయాల్సిన అవసరం లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎంసీడీ ఎంప్లాయీస్ యూనియన్ కన్వీనర్ ఏపీ ఖాన్ అన్నారు.

నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జైప్రకాష్ మాట్లాడుతూ.. ఏకీకరణ కోసం చాలా లేఖలు కూడా రాశామన్నారు. ఇప్పుడు ఉద్యోగుల జీతం కోసం సమ్మె చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడు డబ్బు ఆదా అవుతుందని, దాని నుండి జీతం మరియు పెన్షన్ లభిస్తాయని కార్పొరేషన్ టీచర్స్ న్యాయ్ మంచ్‌కు చెందిన కుల్దీప్ సింగ్ ఖత్రీ చెప్పారు.

Read Also…. Road Accident: డియోరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోలెరో ఢీ.. ఆరుగురు మృతి.. 10మందికి సీరియస్