AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirav Modi: పరారీలో ఉన్న నీరవ్ మోదీపై ఈడీ కీలక చర్య.. రూ.29.75 కోట్ల విలువైన ఆస్తుల సీజ్

భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Nirav Modi: పరారీలో ఉన్న నీరవ్ మోదీపై ఈడీ కీలక చర్య.. రూ.29.75 కోట్ల విలువైన ఆస్తుల సీజ్
Nirav Modi
Balaraju Goud
|

Updated on: Sep 11, 2024 | 8:22 PM

Share

భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో పరారీలో ఉన్న నీరవ్ మోదీ రూ.29 కోట్ల 75 లక్షల విలువైన స్థిరాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం(సెప్టెంబర్ 11) జప్తు చేసింది.

పీఎన్‌బీ బ్యాంక్ స్కామ్ కేసులో పరారీలో ఉన్న నీరవ్ మోదీపై ఈడీ ఈ చర్య తీసుకుంది. రూ. 6,498 కోట్ల బ్యాంకు మోసం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌పై ఈసీఐఆర్ నమోదు చేయడం ద్వారా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ విచారణలో నీరవ్ మోదీ, ఆయన గ్రూపు కంపెనీలకు చెందిన కోట్ల విలువైన భూములు, బ్యాంకు ఖాతాల గురించి ఈడీకి తెలిసింది.

ఇంతకు ముందు కూడా నీరవ్ మోదీకి సంబంధించిన రూ. 2596 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముంబైలోని సీబీఐ, బీఎస్ అండ్ ఎఫ్‌సీ బ్రాంచ్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇండియన్ పీనల్ కోడ్ 1860, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988 సెక్షన్‌ల కింద PNB బ్యాంక్ మోసం కేసులో ED దర్యాప్తు ప్రారంభించింది. భారతదేశంలో నీరవ్ మోదీ, అతని కంపెనీలకు చెందిన రూ. 29.75 కోట్లు మనీలాండరింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న భూమి, భవనాలు, బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బుగా గుర్తించారు.

ఈ ఏడాది ప్రారంభంలో, నీరవ్ మోడీ UK కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, UK కోర్టు అతని బెయిల్‌ను ఏడోవసారి తిరస్కరించింది. బెయిల్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా నీరవ్ మోడీ UK హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు, తరువాత దానిని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం అతను బ్రిటిష్ జైలులో ఉన్నాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇదిలావుంటే, నీరవ్ మోడీని భారతదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది, తద్వారా భారత చట్టం ప్రకారం స్కామ్‌లకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ సందర్భంలో, భారత ప్రభుత్వానికి అప్పగించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..