AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్
Pm Modi Chandrababu Revanth Reddy
Balaraju Goud
|

Updated on: May 17, 2025 | 7:56 AM

Share

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలవరం యాక్షన్‌ప్లాన్‌లోకి దిగబోతున్నారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజాసమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.

పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, పోలవరం ప్రాజెక్టు నీటిని నిలుపుకోవడం ప్రారంభించిన తర్వాత గోదావరి నది బ్యాక్ వాటర్స్‌లో రాష్ట్రం మునిగిపోవడంపై తెలంగాణ ఆందోళనలు లేవనెత్తుతోంది. ఈ ఆందోళనలను జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం దృష్టికి గతంలో తీసుకెళ్లింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కూడా ఇలాంటి ఆందోళనలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లో భాగస్వామ్యులైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య పంచుకునే నీటితో గోదావరి నుండి 80 టిఎంసి అడుగుల నీటిని కృష్ణా నదికి మళ్లించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నుండి తమ వాటాగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు 1.5 టిఎంసి అడుగులు, 5 టిఎంసి అడుగులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను గైడ్‌ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారు.

రిజర్వాయర్‌లో నీటి నిల్వ కోసం 4 రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని సమీక్షించనున్నారు. గడువులోగా పనులన్నీ పూర్తి చేయడంపై ప్రధాని ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి తోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..