AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఆయుష్మాన్ భారత్‌లో 70 ప్లస్ వయసు ఎంట్రీ..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం(సెప్టెంబర్) సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 70 ఏళ్లు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్‌లో చేర్చాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ప్రధాని మోదీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఆయుష్మాన్ భారత్‌లో 70 ప్లస్ వయసు ఎంట్రీ..
Pm Modi Cabinet
Balaraju Goud
|

Updated on: Sep 11, 2024 | 8:46 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం(సెప్టెంబర్) సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 70 ఏళ్లు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్‌లో చేర్చాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చింది. ఈ హామీ మేరకు కేబినెట్‌లో ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. ధనిక, పేద అనే భేదం ఉండదు, ప్రతి ఒక్కరూ దాని పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన కుటుంబాలు ఏటా రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందుతున్నాయి.

ఇంతకుముందు, పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం సందర్భంగా, 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కూడా ఆయుష్మాన్ భారత్ సౌకర్యాలను పొందుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం 55 లక్షల మంది అభ్యర్థులకు ఆయుష్మాన్ భారత్ ఉచిత సేవలు అందిస్తున్నారు. జాతీయ ఆరోగ్య విధానం కింద కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే, పశ్చిమ బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆమోదించడానికి నిరాకరించాయి. రాష్ట్రంలో తమ సొంత పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద అడ్మిషన్‌కు 10 రోజుల ముందు తర్వాత వైద్య ఖర్చులు చెల్లించే నిబంధన కూడా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..