PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు కీలక సమావేశాలను ఏర్పాటు చేశారు.

PM Modi: కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు మోదీ ఫ్లాన్.. ఈ నెల 18, 20న జిల్లా కలెక్టర్లతో సమావేశం..!
PM Modi
Follow us

|

Updated on: May 13, 2021 | 5:03 PM

PM Modi’s to hold discussions: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా నియంత్రణపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు కీలక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈనెల 18వ తేదీన , 20వ తేదీన ఈ భేటీలు ఏర్పాటు చేశారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతారు. రెండు విడతలుగా ఈ సమావేశాలు ఉంటాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాలో పాల్గొంటారు.

ఈనెల18వ తేదీన జరిగే సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లతో మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. రెండు రోజులు తగ్గినట్టే తగ్గి కరోనా కేసులు తిరిగి పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. బీహార్‌లో మే 25 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. మహారాష్ట్రలో జూన్‌ 1 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. మరోవైపు యుపీఎస్‌సీ ప్రిలిమ్స్‌ పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జూన్‌ 27 న జరగాల్సిన పరీక్షను అక్టోబర్‌ 10వ తేదీకి వాయిదా వేశారు.

ఇదిలావుంటే, దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి రోజువారీ కేసులు. నిత్యం 4వేల మందికి పైగా మృతి చెందుతున్నారు. పెరుగుతున్న పాజిటివిటీ, మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో టీకా‌ పంపిణీ చేయాలని ప్రధాని మోదీకి లేఖరాశారు విపక్ష పార్టీల నేతలు. దేశ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయించిన 35 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని కోరారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు 6 వేలు ఇవ్వాలని..సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఇక ఆక్సిజన్, ఔషధాల లభ్యత, సరఫరాపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఔషధాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని..తయారీదారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. గత కొన్నివారాల్లో రెమ్‌డెసివిర్ సహా ఔషధాల ఉత్పత్తి భారీగా పెరిగిందని ప్రకటించారు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా మూడురేట్లు పెరిగిందని..వెంటిలేటర్లను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను కోరారు.

అయితే, భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌కు తప్పుడు అంచనాలే కారణమంటున్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ. కరోనా తగ్గిందని అన్ని కార్యక్రమాలకు అనుమతించారని.. విచ్చలవిడి కార్యక్రమాలే కరోనా ఉధృతికి కారణమంటున్నారు.

Read Also…  కొవిడ్‌తో పోరాడటానికి.. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి.. వెల్లుల్లి, చింతపండుతో చేసిన ఈ సూప్ ట్రై చేయండి..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..