PM Modi: ‘పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను’.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో క్రిస్మస్ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో అనేక మంది పిల్లలు తమ గాత్రంతో అందమైన పాటలు పాడారు. ఈ క్రమంలోనే ఆ పిల్లలందరికీ ప్రధాని మోదీ తన నివాసాన్ని కలియతిరగడానికి అవకాశం కల్పించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో క్రిస్మస్ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో అనేక మంది పిల్లలు తమ గాత్రంతో అందమైన పాటలు పాడారు. ఈ క్రమంలోనే ఆ పిల్లలందరికీ ప్రధాని మోదీ తన నివాసాన్ని కలియతిరగడానికి అవకాశం కల్పించారు.
వారితో ముందుగా ముచ్చటించిన ప్రధాని మోదీ.. ‘దేశ ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని మీరెప్పుడైనా సందర్శించారా’ అని ప్రశ్నించారు. ఇక ఆ పిల్లలు ‘నో’ అని జవాబిచ్చారు. దానితో ‘మీ అందరికీ నా వ్యక్తిగత సిబ్బంది.. ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని అంతా తిప్పి చూపిస్తారు అని హామీ’ మోదీ చెప్పారు.
Curious young minds traversing across 7, LKM clearly made for a great experience. Seems my office passed the ultimate test – they gave it a thumbs up! pic.twitter.com/Eampc8jlHq
— Narendra Modi (@narendramodi) December 27, 2023
కాగా, తన నివాసానికి వచ్చిన అనుకోని అతిధుల పట్ల సంతోషం వ్యక్తం చేసిన పీఎం మోదీ ట్విట్టర్ వేదికగా.. ”ఎంతో దూరం నుంచి ప్రయాణించి 7ఎల్కేఎం వచ్చిన ఈ పిల్లలు.. సరికొత్త అనుభూతిని పొందారు. నా ఆఫీస్ అంతిమ పరీక్ష ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోంది. వారు దానికి ‘థంబ్స్ అప్’ ఇచ్చారు” అని పేర్కొన్నారు.




