AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in Ayodhya Highlights: అంతా రామమయం.. అయోధ్య ఆలయ శిఖరంపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం ఇవాళ్టితో పూర్తయింది.. ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ తో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఆలయపనుల ముగింపునకు గుర్తుగా ఈ ధ్వజారోహణ చేశారు.

PM Modi in Ayodhya Highlights: అంతా రామమయం.. అయోధ్య ఆలయ శిఖరంపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Nov 25, 2025 | 1:55 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం ఇవాళ్టితో పూర్తయింది.. ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ తో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఆలయపనుల ముగింపునకు గుర్తుగా ఈ ధ్వజారోహణ చేశారు.

ఈ మేరకు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. సప్త మందిరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు చేశారు. సప్త మందిర్‌గా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్థ్య, దేవీ అహల్య, మాతా శబరి, నిషాద్‌రాజు గుహుని మందిరాలను దర్శించి అనంతరం శేషావతార్‌ మందిర్‌కు వెళ్లారు.

మాతా అన్నపూర్ణ, రామ దర్బార్‌ గర్భాలయంలో పూజలు చేయనున్నారు. చివరగా రామ్ లల్లా గర్భాలయాన్ని దర్శించి పూజలు చేయనున్నారు. ఇక మధ్యాహ్నం ధ్వజారోహణ చేసిన అనంతరం అక్కడ నిర్వహించే సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

లైవ్ వీడియో చూడండి..

ఉదయం 11గంటల 58 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఈ కాషాయ జెండా ఎగురవేసే కార్యక్రమం జరగనుంది. 161 అడుగుల ఆలయ శిఖరంపై 30 అడుగుల ఎత్తుండే.. జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం పూర్తితో, సాంస్కృతిక వేడుకలు జాతీయ ఐక్యత యొక్క కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ కార్యక్రమం జరుగుతోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Nov 2025 12:38 PM (IST)

    500 సంవత్సరాల యాగం ఈ రోజు పూర్తయింది: ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ..”నేడు, భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం రాముడితో నిండి ఉంది. ప్రతి రామ భక్తుడి హృదయంలో అసాధారణ సంతృప్తి ఉంది. అపరిమితమైన కృతజ్ఞత ఉంది. అపరిమితమైన ఆనందం ఉంది. శతాబ్దాల గాయాలు నయం అవుతున్నాయి. శతాబ్దాల బాధ నేడు చల్లబడుతోంది. శతాబ్దాల సంకల్పం నేడు విజయవంతమవుతోంది. 500 సంవత్సరాలుగా మండిన ఆ యాగం ఈ రోజు పూర్తయింది… ఈ రోజు, రాముడి శక్తి ఈ ధర్మ ధ్వజ రూపంలో గ్రాండ్ రామాలయం శిఖరాగ్రంలో ప్రతిష్టించబడింది…”

    “నేడు, మొత్తం భారతదేశం – ప్రపంచం రాముడితో నిండి ఉన్నాయి. ప్రతి రామ భక్తుడి హృదయంలో అసాధారణ సంతృప్తి ఉంది. అపరిమితమైన కృతజ్ఞత ఉంది. అపరిమితమైన ఆనందం ఉంది. శతాబ్దాల గాయాలు నయం అవుతున్నాయి. శతాబ్దాల బాధ నేడు చల్లబడుతోంది. శతాబ్దాల సంకల్పం ఈ రోజు నెరవేరుతోంది. 500 సంవత్సరాలుగా వెలిగించబడిన ఆ యాగం ఈ రోజు పూర్తయింది…” అంటూ .. ప్రధాని మోదీ అన్నారు.

  • 25 Nov 2025 12:34 PM (IST)

    ఈ జెండా కేవలం చిహ్నం కాదు..

    “ఈరోజు శతాబ్దాల పాటు జరిగిన యజ్ఞం పూర్తయింది, దీని పవిత్ర జ్వాల 500 సంవత్సరాలు విశ్వాసం.. శ్రీరాముని దైవిక శక్తి ఇప్పుడు ఈ గొప్ప ఆలయంలో ఈ ధర్మధ్వజం రూపంలో ప్రతిష్టించబడింది. ఈ జెండా కేవలం చిహ్నం కాదు, ఇది భారతీయ నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది.”.. అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  • 25 Nov 2025 12:33 PM (IST)

    ప్రపంచం మొత్తం రాముని ఉనికితో నిండి ఉంది: ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ అయోధ్య రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “నేడు, అయోధ్య నగరం భారతదేశ సాంస్కృతిక స్పృహతోపాటు.. మరో చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. నేడు, భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం రాముని ఉనికితో నిండి ఉంది. ప్రతి రామ భక్తుడి హృదయంలో, అసమానమైన సంతృప్తి, అపరిమితమైన కృతజ్ఞత, అపారమైన, పరలోక ఆనందం ఉన్నాయి.” అంటూ పేర్కొన్నారు.

  • 25 Nov 2025 12:21 PM (IST)

    అనేక మంది త్యాగాలు చేశారు: RSS చీఫ్ మోహన్ భగవత్

    RSS సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. “ఇది మనందరికీ ఒక ముఖ్యమైన రోజు. అనేక మంది ఈ కల సాకారం కోసం చూశారు.. దీని కోసం అనేక మంది ప్రయత్నాలు చేశారు.. అనేక మంది త్యాగాలు చేశారు. ఈ రోజు వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. అశోక్ జీ (అశోక్ సింఘాల్) ఈ రోజు శాంతిని అనుభవించి ఉండాలి. మహంత్ రామచంద్ర దాస్ జీ మహారాజ్, దాల్మియా జీ (సీనియర్ VHP నాయకుడు విష్ణు హరి దాల్మియా) అనేక మంది సాధువులు, ప్రజలు, విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసి కష్టపడి పనిచేశారు. అందరూ కూడా ఆలయ నిర్మాణం కోసం ఆశతో ఎదురుచూశారు.. ఆలయం ఇప్పుడు నిర్మించబడింది.. నేడు, ఆలయ ‘శాస్త్రీయ ప్రక్రియ’ జరిగింది. ధ్వజారోహణం ఈ రోజు జరిగింది.”. అంటూ పేర్కొన్నారు.

  • 25 Nov 2025 12:12 PM (IST)

    కొత్త శకానికి నాంది.. యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

    యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ “… శ్రీ అయోధ్య ధామ్‌లోని భగవాన్ రాముడి గొప్ప ఆలయంలో జెండా ఎగురవేయడం ‘యజ్ఞం’.. ‘పూర్ణాహుతి’ కాదు.. కొత్త శకానికి నాంది. ఈ సందర్భంగా రామ భక్తుల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు…” అంటూ పేర్కొన్నారు.

  • 25 Nov 2025 12:00 PM (IST)

    కాషాయ జెండాను ఎగురవేసిన మోదీ.. వీడియో

    ప్రధానమంత్రి మోదీ, RSS సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ పవిత్ర శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేశారు.. ఇది ఆలయ నిర్మాణం పూర్తయినందుకు ప్రతీకగా ఎగురవేశారు.

  • 25 Nov 2025 11:58 AM (IST)

    కాషాయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ, భగవత్

    ఆలయ నిర్మాణం పూర్తయినందుకు ప్రతీకగా ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ పవిత్ర శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వారితో ఉన్నారు. 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు గల లంబకోణ త్రిభుజాకార జెండా, భగవాన్ శ్రీరాముని తేజస్సు, శౌర్యాన్ని సూచించే ప్రకాశవంతమైన సూర్యుని చిత్రాన్ని కలిగి ఉంది.. దానిపై కోవిదర చెట్టు చిత్రంతో పాటు ‘ఓం’ చెక్కబడి ఉంది. పవిత్ర కాషాయ జెండా గౌరవం, ఐక్యత – సాంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని తెలియజేస్తుంది.

  • 25 Nov 2025 11:54 AM (IST)

    భగవాన్ శ్రీరాముని తేజస్సు – పరాక్రమానికి ప్రతీకగా..

    పది అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల పొడవు గల ధర్మ ధ్వజం, భగవాన్ శ్రీరాముని తేజస్సు – పరాక్రమానికి ప్రతీకగా ప్రకాశవంతమైన సూర్యుని ప్రతిమను కలిగి ఉంది.. దానిపై కోవిదర చెట్టు చిత్రంతో పాటు ‘ఓం’ అనే అక్షరం చెక్కబడి ఉంది.

  • 25 Nov 2025 11:52 AM (IST)

    అయోధ్య రామాలయ శిఖరంపై కాషాయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

    అయోధ్య రామాలయ శిఖరంపై ప్రధాని మోదీ కాషాయ జెండాను ఆవిష్కరించారు. అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం ఇది. ధ్వజారోహణ కార్యక్రమంలో అయోధ్య మందిర నిర్మాణ ప్రక్రియ పరిపూర్ణం అయింది. అందుకే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నాటి ఉత్సాహం, భక్తిభావన కనిపిస్తున్నాయి.

  • 25 Nov 2025 11:33 AM (IST)

    ఆలయం శిఖరంపై జెండా..

    అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయం ‘శిఖరం’పై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ జెండాను ఎగురవేయనున్నారు. సాంప్రదాయ ఉత్తర భారత నగర నిర్మాణ శైలిలో నిర్మించిన శిఖరంపై జెండా ఎగనుంది. దక్షిణ భారత నిర్మాణ సంప్రదాయంలో రూపొందించబడిన ఆలయం చుట్టూ నిర్మించిన 800 మీటర్ల పార్కోటా, ఆలయ నిర్మాణ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.

  • 25 Nov 2025 11:21 AM (IST)

    రామ్ లల్లాకు ప్రత్యేక పూజలు

    అయోధ్య ధ్వజారోహణం | అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిరంలో చారిత్రాత్మక జెండా ఎగురవేతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ రామ్ లల్లాకు ప్రార్థనలు చేశారు.

  • 25 Nov 2025 11:19 AM (IST)

    కట్టుదిట్టమైన ఏర్పాట్లతో

    కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఆలయ చుట్టుపక్కల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ధ్వజారోహణ కార్యక్రమంతో అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తికానుంది.

  • 25 Nov 2025 11:13 AM (IST)

    ప్రధాని మోదీ, RSS చీఫ్‌ మోహన్‌భగవత్‌ పూజలు..

    ధ్వజారోహణం, కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు RSS చీఫ్‌ మోహన్‌భగవత్‌ హాజరయ్యారు.

  • 25 Nov 2025 11:12 AM (IST)

    ప్రధాని మోదీ పూజలు

    శ్రీ రామ జన్మభూమి మందిరంలో చారిత్రాత్మక ధ్వజారోహణకు ముందు మాతా అన్నపూర్ణ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు చేశారు.

  • 25 Nov 2025 11:06 AM (IST)

    కాషాయ జెండాను ఎగురవేయనున్న ప్రధాని మోదీ

    ధ్వజారోహణ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేయనున్నారు. 161 అడుగుల ఆలయ శిఖరంపై 30 అడుగుల ఎత్తుండే.. జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటల 58 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఈ కాషాయ జెండా ఎగురవేసే కార్యక్రమం జరగనుంది.

Published On - Nov 25,2025 11:06 AM