AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తెలంగాణ సంస్కృతి, ప్రతిభపై ప్రధాని మోదీ ప్రశంసలు.. 100వ ఎపిసోడ్‌ మన్ కీ బాత్‌లో..

ప్రజలతో మమేకం కావడమే మోదీ మన్‌ కీ బాత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు ప్రముఖుల గురించి ప్రస్తావిస్తుంటారు. అయితే మన్ కీ బాత్‌లో మోదీ నోటి వెంట తెలుగువాళ్ల ప్రస్తావన కూడా వచ్చింది. అందులోనూ తెలంగాణ సంస్కృతి, ప్రతిభపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఎవరి గురించి.. ఏం మాట్లాడారో చూద్దాం..

PM Modi: తెలంగాణ సంస్కృతి, ప్రతిభపై ప్రధాని మోదీ ప్రశంసలు.. 100వ ఎపిసోడ్‌ మన్ కీ బాత్‌లో..
PM Modi Mann Ki Baat
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 24, 2023 | 5:47 PM

ప్రధాని మోదీ మనస్సులో ఏముంది? ప్రతీ నెలా ఆయన తన మనస్సులోని మాటను మన్‌ కీ బాత్‌లో ప్రజలకు నేరుగా తెలియజేస్తారు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన మన్‌ కీ బాత్‌ రేడియో ప్రోగ్రామ్‌ ఇప్పుడు వందవ ఎపిసోడ్‌కు చేరింది. ప్రధాని నేరుగా దేశప్రజలతో మాట్లాడే ఈ అపూర్వ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉంది. ప్రధాని దేని గురించి మాట్లాడతారు, ఏ విషయాలను ప్రస్తావిస్తారనేది దేశప్రజలందరూ ఆసక్తిని ఎదురుచూసే వినూత్న, విశిష్ఠ కార్యక్రమం. మన్‌ కీ బాత్‌లో సామాన్యులకు తెలియని అనేక విషయాలను సవివరంగా ప్రధాని వివరించే తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీది అద్భుతమైన వాక్పటిమ. ప్రవాహంలా సాగుతుంది ఆయన వాగ్దాటి. ఏ విషయమైనా సరే ఆయన కథ చెప్పినట్టు చెప్పి ప్రజలను మెప్పించగలరు, ఒప్పించగలరు. ఆయనలో ఉన్న ఈ కళే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. రకరకాల అంశాలపై మన్‌కీ బాత్‌లో మోదీ మాట్లాడే మాటలు, చెప్పే ఉదాహరణలు ఎన్నో రంగాలు, ఎన్నో విషయాల్లో సమూల మార్పు తీసుకు వచ్చాయి, తీసుకు వస్తున్నాయి.

ప్రజలను అమితంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు వందో ఎపిసోడ్‌‌లో తెలంగాణ సంస్కృతి, ప్రతిభపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100వ ఎపిసోడ్‌ పూర్తి కానుంది. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ తన మనసులోని మాటలనే కాకుండా.. తరుచుగా భారతదేశం అంతటా స్ఫూర్తిదాయకమైన కథనాలను శ్రేతలతో పంచుకుంటారు. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ ఎపిసోడ్‌లలో పలు సందర్భాల్లో తెలంగాణపై ప్రశంసలు కురిపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణలోని ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి విశేషమైన విజయాలను నొక్కిచెప్పారు. పూర్ణా మాలావత్ అసాధారణ పర్వతారోహణ పరాక్రమాన్ని ప్రశంసించడం నుంచి చింతల వెంకట్ రెడ్డి గ్రౌండ్ బ్రేకింగ్ విటమిన్ డి-రిచ్ రైస్‌ను ప్రశంసించడం వరకు ప్రధాని మోదీ తన వాక్పటిమతో వినిపించారు. భారతదేశానికి తెలంగాణ చేసిన అనేక సహకారాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వినించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నేత వెల్ది హరిప్రసాద్ చేతితో తయారు చేసిన G20 చిహ్నాన్ని అందుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తెలంగాణలో జరుపుకునే గిరిజన సంస్కృతి,  పండుగలను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తి చేసుకున్నారు. ఉదాహరణకు, రాష్ట్ర గిరిజన సంస్కృతికి సంబంధించిన కథలను పంచుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళా గిరిజన వీరులైన సమ్మక్క, సారలమ్మను గుర్తు చేసుకుంటూ జరుపుకునే మేడారం జాతర పండుగను ప్రధాని మోదీ ప్రస్తావించారు.

డ్రోన్ ఆధారిత వ్యాక్సిన్‌ల డెలివరీ కోసం రాష్ట్రం మార్గదర్శక ట్రయల్స్ ద్వారా ప్రదర్శించబడిన్ని ఆవిష్కరణల కోసం తెలంగాణ డ్రైవ్‌ను కూడా ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. మనోహరమైన కథలు, పరస్పర చర్యలను పంచుకోవడం ద్వారా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలలో తనకున్న గౌరవాన్ని పెంచారు. వారి కథలతో దేశాన్ని కదిలించారు.

మన్‌ కీ బాత్‌ వందో ఎపిసోడ్‌లో తెలంగాణపై ప్రధాని మోదీ..

  • చింతల వెంకట్ రెడ్డి విటమిన్‌-డి లో సమృద్ధిగా ఉన్న బియ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆ లోపాన్ని ప్రజలు స్వయంగా నయం చేసుకోవడానికి వీలు కల్పించారు. ఇందుకుగానూ ఆయనను పద్మశ్రీతో సత్కరించారు.
  • తెలంగాణకు చెందిన పి అరవింద్ రావు చంద్రయాన్ మిషన్‌పై మాట్లాడాలని ప్రధానిని కోరారు.
  • హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా నుంచి విజయవంతంగా కోలుకోవడంపై తన అనుభవాన్ని వివరించమని హైదరాబాదీ తొలి కరోనా పేషెంట్‌ రామ్‌ గంప తేజను ప్రధాని మోదీ కోరారు.
  • ఏడు పర్వతాల శిఖరాలను అధిరోహించిన పూర్ణ మాలావత్‌ను ప్రధాని మోదీ అభినందించారు.
  • ఈ-వ్యర్థాలపై మాట్లాడాలని విజయ్ ప్రధానిని కోరారు. దీనికి ప్రతిస్పందనగా ప్రధాని మోదీ ఈ-వేస్ట్ అంటే కచ్రే సే కంచన్ గురించి మాట్లాడారు.
  • హరిప్రసాద్ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కార్మికుడు. ఆయన చేతితో నేసిన జీ 20  చిహ్నాన్ని ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.
  • భారతదేశం ఆఫ్రికా నుంచి చిరుతలను తరలించడం పట్ల ఎన్ రామచంద్రన్ రఘురాం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
  • వచ్చే ఏడాది తెలంగాణలోని తుంగభద్ర నది ఒడ్డున పుష్కరాలు జరగనున్నాయని ప్రధాని మోదీ చెప్పడం విశేషం.
  • తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని మాంగ్త్యా-వాల్య తండా పంచాయతీ అమృత్ సరోవర్లను నిర్మించింది.
  • తెలంగాణలో ఇద్దరు గిరిజన వీర మహిళలు సమ్మక్క, సారలమ్మలను పూజిస్తూ జరుపుకునే మేడారం జాతర ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.
  • తెలంగాణ డ్రగ్స్, మెడిసిన్ డ్రోన్ డెలివరీ కోసం ట్రయల్స్ సెట్ చేసింది.

100వ ఎపిసోడ్‌ను చిరస్మరణీయంగా నిలిపేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని మై గావ్ డాట్‌ ఇన్‌ ఇప్పటికే దేశ ప్రజలందరిని ఆహ్వానించింది. ఇందులో ఎంపికైన సూచనలను ప్రధాని మోదీ ప్రస్తావిస్తారని ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం