
PM Kisan Yojana next installment: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రతీ ఏటా రూ. 6 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రూ. 2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతులకు అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద భూమి ఉన్న రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున నగదు.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
మే 31, 2022న ప్రధానమంత్రి-కిసాన్ పథకం 11వ విడతగా 10 కోట్ల మంది రైతులకు లబ్ధిచేకూరింది. రూ. 21,000 కోట్లకు పైగా నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే.. ఇప్పుడు 12 విడత నగదు పంపిణీ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోండి..
పీఎం కిసాన్ 12వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయంటే..?
PM కిసాన్ యోజన 12 వ విడత నగదు బహుశా సెప్టెంబర్ 1, 2022 తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణంగా, మొదటి వ్యవధి ఏప్రిల్ నుంచి జూలై వరకు, రెండవది ఆగస్టు నుంచి నవంబర్ వరకు, మూడో విడత నగదు పంపిణీ.. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది.
జూలై 31 వరకు eKYC అప్డేట్ గడువు..
కాగా.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదు పంపిణీ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నగదు జమ కావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. పీఎం కీసాన్ లబ్ధిదారులందరికీ eKYC గడువును కేంద్ర ప్రభుత్వం మే 31 నుంచి జూలై 31 వరకు పొడిగించింది. PMKISAN పోర్టల్లో OTP ఆధారిత eKYC అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.
ఆధార్ కార్డ్ లేకుండా లబ్ధిదారుల స్థితిని ఎలా తనిఖీ చేయాలి
eKYCని ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి