AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మోదీ క్రేజ్ అంటే ఇలా ఉంటాది మరి.. కలకత్తాలో మెట్రో స్టేషన్‌లో హెరెత్తిన నినాదాలు..

దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేశాయి.. హుగ్లీ నదిలో నిర్మించిన టన్నల్‌లో మెట్రో రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కోలకతా- హౌరా మధ్య ఈ అండర్‌ వాటర్‌ మెట్రో పరుగులు తీయనుంది. రేపటినుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రారంభోత్సవానికి ముందు.. ప్రధాని మోదీ కలకత్తాలోని మెట్రోస్టేషన్ ను సందర్శించారు.

PM Modi: మోదీ క్రేజ్ అంటే ఇలా ఉంటాది మరి.. కలకత్తాలో మెట్రో స్టేషన్‌లో హెరెత్తిన నినాదాలు..
PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2024 | 11:46 AM

Share

దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేశాయి.. హుగ్లీ నదిలో నిర్మించిన టన్నల్‌లో మెట్రో రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కోలకతా- హౌరా మధ్య ఈ అండర్‌ వాటర్‌ మెట్రో పరుగులు తీయనుంది. రేపటినుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రారంభోత్సవానికి ముందు.. ప్రధాని మోదీ కలకత్తాలోని మెట్రోస్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా కోల్‌కత్తాలోని మెట్రో స్టేషన్‌లో ప్రజలు ‘మోదీ మోదీ’.. ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సందర్భంగా ప్రధాని మోదీ వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 15,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Pm Narendra Modi

వీడియో చూడండి..

కోలకతా నగరంలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ వాటర్ రైలు మార్గాన్ని నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మధ్య 16.6 కిలో మీటర్ల మేర మెట్రోమార్గాన్ని నిర్మించగా..ఇందులో 10.8 కి.మీ. భూగర్భంలోనే ఉంది. ఈ మెట్రో రైలులో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 2009లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించగా.. 2017లో ఈ టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది. దేశంలో తొలి మెట్రో రైలు ప్రారంభమైంది కోల్‌కతాలోనే కాగా.. ఇప్పుడు ఈ అద్భుతమైన అండర్‌ వాటర్‌ మెట్రో రైల్‌ సర్వీసులు కూడా అక్కడే ప్రారంభమవ్వడం విశేషం..

వీడియో చూడండి..

హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి ప్రస్తుతం 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ అండర్ వాటర్ మెట్రో రైలు నడిచే మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉండగా.. అందులో మూడు భూగర్భంలోనే ఉన్నాయి. ఈ అండర్ వాటర్ మెట్రో రైలు ప్రయాణ దూరాన్ని తగ్గించడంతోపాటు కోల్‌కతా వాసులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..