AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Threat Call: CM ఆఫీస్‌కు పాకిస్థాన్‌ నెంబర్‌ నుంచి బాంబు బెదిరింపు మెసేజ్‌!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పాకిస్థాన్ ఫోన్ నంబర్ నుండి వాట్సాప్ ద్వారా బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతను పెంచారు. ఈ ఘటన తీవ్రమైన భద్రతా సమస్యలను లేవనెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Bomb Threat Call: CM ఆఫీస్‌కు పాకిస్థాన్‌ నెంబర్‌ నుంచి బాంబు బెదిరింపు మెసేజ్‌!
Police
Ravi Kiran
|

Updated on: Feb 28, 2025 | 3:06 PM

Share

మన శత్రు దేశం పాకిస్థాన్‌ నుంచి ఏదో ఒక విధంగా ముప్పు పొంచి ఉండనే ఉంటుంది. బార్డర్‌లో సైనికులు కాపాలాగా ఉన్నా.. ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకొని ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు ఆ దేశంలో ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(CMO)పై దాడి జరుగుతుందని బుధవారం మధ్యాహ్నం బెదిరింపు సందేశం వచ్చింది. అది మెసేజ్‌ వాట్సాప్‌ ద్వారా రావడం గమనార్హం. పాకిస్తాన్ ఫోన్ నంబర్ నుండి వర్లి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ సందేశం వచ్చింది. ఇది తీవ్రమైన భద్రతా సమస్యలను లేవనెత్తింది.

దీంతో వెంటనే అలెర్ట్‌ అయిన పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆ నంబర్‌ ఎవరిది? కచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలను ఆరా తీశారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. సాధారణంగా సీఎం ఆఫీస్‌కు గట్టి బందోబస్తు ఉంటుంది. ఇప్పుడు ఈ బాంబు బెదిరింపు నేపథ్యంలో భద్రతా మరింత పెంచారు. బెదిరింపు తర్వాత, ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇతర అధికారులు ఆ మెసేజ్‌ ఎవరు పంపారు? ఉగ్రవాదుల నుంచి ఏమైన ముంపు పొంచి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.