Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal Earthquake: నేపాల్‌, బిహార్‌లో భూకంపం! భయంతో పరుగులుపెట్టిన జనం

Nepal Earthquake: నేపాల్‌, బిహార్‌లో భూకంపం! భయంతో పరుగులుపెట్టిన జనం

SN Pasha

|

Updated on: Feb 28, 2025 | 8:20 AM

శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. హిమాలయాల మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో కేంద్రీకృతమైన ఈ భూకంపం, భారత్‌లోని బిహార్, బెంగాల్, సిక్కింలలోనూ ప్రకంపనలను కలిగించింది. ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపినప్పటికీ, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఎదురు చూడాల్సి ఉంది.

హిమాలయ పర్వత ప్రాంతంలో మళ్లీ భూకంపం సంభవించింది. మన మిత్రదేశం నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చింది. దీంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రియాక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది. ఆ ప్రకంపనలు మనదేశంలోనూ కనిపించాయి. బిహార్‌లో కూడా ఈ భూకంపం ఎఫెక్ట్ కనిపించింది. అసోంలో భూకంపం వచ్చిన 24 గంటల్లోనే నేపాల్‌లో భూ ప్రకంపనలు రావడం కలవరపెడుతోంది. హిమాలయా మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లో మాత్రమే కాకుండా భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలతో పాటు.. బిహార్, బెంగాల్, సిక్కింలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు తమ ఇళ్లు, భవనాలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.