Jammu Kashmir: మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్.. కాశ్మీర్కు వచ్చిన పర్యాటకులు ఏమంటున్నారంటే!
విధ్వంసకర ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ లోయలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. నెమ్మదిగా దేశియ, విదేశీ పర్యాటకులు కాశ్మీర్కు అందాలను చూసేందుకు వస్తున్నట్టు సమాచారం. కాశ్మీర్కు వచ్చిన పర్యాటకులు తమ భద్రత, రక్షణపై విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి.. ప్రశాంతమైన, పచ్చని ప్రకృతిపై రక్తపు మరకలు పడేలా చేసింది. ప్రకృతి ఆస్వాధించేందుకు వచ్చిన సుమారు 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఈ భయంకరమైన ఉగ్రచర్య ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. కాశ్మీర్ పర్యటనకు రావాలంటే పర్యాటకులు భయపడే పరిస్థితి నెలకొల్పింది. అయితే ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మళ్లీ ఇలాంటి ఘటనలు చెలరేగకుండా భద్రతా చర్యలను చేపట్టింది. కాశ్మీర్కు వచ్చే పర్యాటకులకు భద్రతకు భరోసాను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మెళ్ల మెళ్లగా పర్యాటకులు మళ్లీ కాశ్మీర్ పర్యటనలకు వస్తున్నట్టు తెలుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఈ ప్రాంత భద్రతపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ ప్రయాణ ప్రణాళికలను కొనసాగిస్తున్నారు.
ఈ విధ్వంసకర ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని ప్రశాంతమైన లోయ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ ప్రాంతం మరోసారి దేశీయ, అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించడం ప్రారంభించింది. తన ప్రణాళికల ప్రకారం పర్యటనను సాగిస్తూ కాశ్మీర్కు వచ్చిన కొందరు దేశియ, విదేశీ పర్యాటకులు ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కోల్కతా, బెంగళూరులు నుంచి వచ్చిన కొందరు పర్యాటకులు ఓ ప్రముఖ న్యూస్ ఛాన్ల్తో మాట్లాడుతూ..కాశ్మీర్ ఇప్పుడు సురక్షితంగా ఉంది, ఇక్కడి మెళ్లగా పర్యాటకులు కూడా వస్తున్నారు. వారు ఇక్కడ సురక్షితంగానే ఉన్నారు, కాబట్టి మీకు ప్రణాళికలు ఉంటే దయచేసి రద్దు చేసుకోవద్దు అని ఆయన అన్నారు. గుజరాత్లోని సూరత్కు చెందిన పర్యాటకుడు మహ్మద్ అనాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. పహల్గామ్లో వ్యాపారం యథావిధిగా కొనసాగుతోందని ఆయన అన్నారు. పర్యాటకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం, సైన్యం, స్థానికులు తమతో ఉన్నారని..తమ భద్రతను చూసుకుంటున్నట్టు తెలిపారు.
మరోవైపు విదేశీయులు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దాడి తర్వాత తమకు భయం కానీ, అసౌకర్యం కానీ కలగలేదని విదేశీయులు పేర్కొన్నారు. తరచుగా వచ్చే సందర్శకులు ఆతిథ్యం మారలేదని తెలిపారు. తాము 3-4 రోజులుగా ఇక్కడ ఉన్నామని..తాము చాలా సురక్షితంగా ఉన్నట్టు వారు తెలిపారు. భారత దేశం చాలా అందంగా ఉందని.. అక్కడి ప్రజలు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని తెలిపారు. కాశ్మీర్కు వచ్చే ముందే ఈ సంఘటన గురించి విన్నామని..ఏమైనప్పటికీ తాము ఇక్కడికి వచ్చాక తాము సురక్షితంగా ఉన్నట్టు క్రొయేషియాకు చెందిన ఒక మహిళ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్తో తన అభిప్రాయాన్ని పంచుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..