AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించిన ఈ ఇద్దరు లేడీ ఆఫీసర్లు ఎవరు? దేశాన్ని రక్షించడంలో వారి పాత్ర ఏంటి?

కల్నల్ సోఫియా ఖురేషి బహుళజాతి సైనిక విన్యాసాలలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనేక కష్టతరమైన రెస్క్యూ మిషన్లలో విజయవంతంగా పాల్గొన్నారు. ఇద్దరు అధికారులు ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో మాట్లాడారు.

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించిన ఈ ఇద్దరు లేడీ ఆఫీసర్లు ఎవరు? దేశాన్ని రక్షించడంలో వారి పాత్ర ఏంటి?
Colonel Sophia Qureshi And
Follow us
SN Pasha

|

Updated on: May 07, 2025 | 1:31 PM

భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు – వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సిందూర్ గురించి బుధవారం సంయుక్తంగా మీడియాకు వివరించారు. అయితే.. ఈ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌ గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

కల్నల్‌ సోఫియా ఖురేషి..

భారత సైన్యం కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో నియమించబడిన ఆఫీసర్‌ కల్నల్ సోఫియా ఖురేషి బహుళజాతి సైనిక విన్యాసాలలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిణిగా గుర్తింపు పొందారు. 2016లో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత్‌కు ఆమె నాయకత్వం వహించారు. విశేషమేమిటంటే పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్. కల్నల్ ఖురేషి గుజరాత్ కు చెందినవారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె సైనిక కుటుంబం నుంచే వచ్చారు. ఖురేషీ తాత భారత సైన్యంలో పనిచేశారు. ఆమె మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఒక అధికారిని వివాహం చేసుకున్నారు.

ఆమె UN శాంతి పరిరక్షక కార్యకలాపాల (PKO)లో ఆరు సంవత్సరాలు సేవలందించారు. కాంగోలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో (2006) కూడా ఆమె గణనీయమైన సేవలు అందించారు. సాయుధ దళాలలోని ఇతర మహిళలు దేశం కోసం కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయాలని ప్రోత్సహించేవారు. అప్పటి సదరన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ ఒకసారి ఖురేషి గురించి మాట్లాడుతూ.. ఆమె ఎంపిక ఆమె లింగం కంటే ఆమె సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాల ఆధారంగా జరిగిందని పేర్కొన్నారు.

వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌..

వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వైమానిక దళంలో చేరడం ఆమెకు చిన్నతనంలో ఉన్న కలతో ప్రారంభమైంది. ఆమె పాఠశాల రోజుల నుండి విమానాల్లో ప్రయాణించాలని ఉండేది. వ్యోమిక ఆమె పేరు, దానికి అర్థం ఆకాశంలో నివసించేది లేదా ఆకాశం కుమార్తె అని అర్థం. ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించి, తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమె కుటుంబంలో సాయుధ దళాలలో చేరిన మొదటి వ్యక్తి అయ్యారు. ఆమె ఇండియన్‌ నేవీలో హెలికాప్టర్ పైలట్‌గా నియమితులయ్యారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ పొందారు.

వింగ్ కమాండర్ సింగ్ 2,500 కంటే ఎక్కువ గంటలు విమాన ప్రయాణాన్ని నమోదు చేశారు. జమ్మూ కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో సహా కొన్ని కఠినమైన భూభాగాలలో ఆమె చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపింది. ఆమె బహుళ రెస్క్యూ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. ఆమె నాయకత్వం వహించిన ప్రధాన మిషన్లలో ఒకటి నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఆపరేషన్లు అధిక ఎత్తు, క్లిష్ట వాతావరణం, మారుమూల ప్రాంతాలలో నిర్వహించారు. వింగ్ కమాండర్ సింగ్ అధిక-ధైర్య మిషన్లలో కూడా పాల్గొన్నారు. 2021లో ఆమె 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ మణిరాంగ్‌కు ట్రై-సర్వీసెస్ ఆల్-ఉమెన్ పర్వతారోహణ యాత్రలో చేరారు. అటువంటి మిషన్లలో ఆమె పాల్గొనడం భారతదేశ రక్షణ సేవలలో నాయకత్వం, క్షేత్ర పాత్రలలో మహిళల ప్రమేయాన్ని ప్రతిబింబిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి