AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయంత్రం 4 గం. నిర్మ‌లా సీతారామ‌న్ మీడియా స‌మావేశం..నేటి కీల‌క అంశాలు

ఇవాళ మ‌రో రంగానికి సంబంధించిన‌ ఆర్థిక ప్యాకేజీ వివ‌రాల‌ను ఆమె వెల్ల‌డించ‌నుండ‌గా, ఏం ప్ర‌క‌టిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

సాయంత్రం 4 గం. నిర్మ‌లా సీతారామ‌న్ మీడియా స‌మావేశం..నేటి కీల‌క అంశాలు
Jyothi Gadda
| Edited By: |

Updated on: May 14, 2020 | 3:29 PM

Share

ఇవాళ కూడా సాయంత్రం 4 గంట‌ల‌కు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ మ‌రో రంగానికి సంబంధించిన‌ ఆర్థిక ప్యాకేజీ వివ‌రాల‌ను ఆమె వెల్ల‌డించ‌నుండ‌గా, ఏం ప్ర‌క‌టిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. విడ‌త‌ల వారీగా ఆర్థిక ప్యాకేజీ వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని నిన్న‌టి మీడియా స‌మావేశంలో నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. కాగా, నిన్న కంపెనీల‌ల‌కు ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే, ఇవాళ్టి ప్రెస్ మీట్‌లో ఏ అంశాల‌ను ప్రాధాన్యంలోకి తీసుకుంటార‌నే దానిపై ప‌లువురు విశ్లేష‌కులు వారి వారి అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు .ఇందులో ముఖ్యంగా వ్య‌వ‌సాయ రంగానికి అధిక‌ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రో ప్ర‌ధాన అంశం డిమాండ్ అండ్ స‌ప్లై మీద కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, రూ. 20ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వ‌ల్ల దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు లాభ‌ప‌డ‌తార‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సామాన్య ప్ర‌జ‌లు ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న చేసిన ప్ర‌క‌ట‌న‌లో సామాన్యుడికి నేరుగా ఎలాంటి లాభం క‌లుగ‌లేదంటూ సోష‌ల్ మీడియా వేదికగా ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. వ‌ల‌స కూలీల‌కు, పేద‌ల‌కు ఎలాంటి శుభ‌వార్త వినిపించ‌లేదు. దీంతో ఆర్థిక ప్యాకేజీ లెక్క‌ల సంగ‌తి ఏమో కానీ, త‌మ‌కేమైనా లాభం క‌లిగిందా అంటూ సామాన్యుడు ప్ర‌శ్నిస్తున్న‌ట్లు నెట్టింట్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ మ‌రోమారు మీడియా ముందుకు వ‌స్తున్న సీత‌మ్మ సామాన్యుల‌ను క‌రుణిస్తుందేమో చూడాలి మ‌రీ అంటూ వాపోతున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం