ఆకాశంలో కదులుతున్న చుక్కలు.. ఏలియన్స్ అనుకుని పరుగులు తీసిన జనాలు.. ఇంతకు అదేంటీ..?

30 నుంచి 50 చుక్కలు సరళరేఖలో కనిపించాయి. ఈ కాంతి బిందువులు ఒకే సరళ రేఖలో ప్రయాణిస్తాయి. గ్రహాంతరవాసులుగా భావించి ప్రజలు ఆందోళనలోపడ్డారు. . అయితే,

ఆకాశంలో కదులుతున్న చుక్కలు.. ఏలియన్స్ అనుకుని పరుగులు తీసిన జనాలు.. ఇంతకు అదేంటీ..?
Mysterious Lights
Follow us

|

Updated on: Oct 29, 2022 | 9:20 PM

శుక్రవారం సాయంత్రం ఉడిపిలో కదులుతున్న నక్షత్రాలను చూసి ప్రజలు అవాక్కయ్యారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని బైందూరు కాపు సహా పలు ప్రాంతాల్లో ఆకాశాన్ని చూసిన ప్రజలకు ఈ కదులుతున్న నక్షత్రాలు కనిపించాయి. ఇవి గ్రహాంతరవాసుల కదలికలుగా వారు చర్చించుకోవటం మొదలుపెట్టారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు వాస్తవాన్ని వెల్లడించారు. ఇవి ఏలియన్స్ కాదు. గతేడాది కూడా కాంతి కిరణాలు సరళరేఖలో ప్రయాణించడాన్ని ప్రజలు చూశారు. ఈ సరళరేఖలో కాంతి కిరణాల కదలిక గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. కాబట్టి ఆకాశంలో కనిపించే ఈ లైట్ పాయింట్లు, వాటి కదలికల అసలు రహస్యం ఏమిటి? అన్నదానిపై ఉడిపిలోని పూర్ణప్రజ్ఞా కళాశాల అధ్యాపకులు ఖగోళ శాస్త్రవేత్త అతుల్ భట్ వివరించారు. ఖగోళ శాస్త్రవేత్త అతుల్ భట్ ఆకాశంలో కాంతి రేఖ యొక్క అద్భుతం గురించి తెలియజేశారు. మంగళూరులోని ఉడిపి ప్రాంతంలో 30 నుంచి 50 చుక్కలు సరళరేఖలో కనిపించాయి. ఈ కాంతి బిందువులు ఒకే సరళ రేఖలో ప్రయాణిస్తాయి. గ్రహాంతరవాసులుగా భావించి ప్రజలు ఆందోళనలోపడ్డారు. . అయితే ఇవి ఏలియన్స్ కావని, స్టార్ లింక్ అనే కంపెనీకి చెందిన శాటిలైట్లని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా శాస్త్రవేత్త ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ ఈ కంపెనీ నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. నెట్‌వర్క్ అందుబాటులో లేని గ్రామాలు, ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి ఈ ఏర్పాటు చేయబడింది. పన్నెండు వేల ఉపగ్రహాలను షీల్డ్ రూపంలో భూమి చుట్టూ పంపనున్నారు. నెట్ వర్క్ రాని ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించేందుకు వీటిని వదిలేశామన్నారు.

రానున్న రోజుల్లో 44,000 ఉపగ్రహాలు ప్రయోగించే అవకాశం ఉండగా.. ఇప్పటికే మూడున్నర వేల ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించే ముందు ఆకాశంలో సరళరేఖలో ప్రయాణిస్తాయి. నిన్న సాయంత్రం స్టార్‌లింక్ G31 సిరీస్ ఉపగ్రహం కనిపించింది. అలాంటి 53 ఉపగ్రహాలను నిన్న ప్రయోగించారు. ఇది శనివారం సాయంత్రం కూడా హోరిజోన్‌కు అతి దగ్గరగా వెళ్లినట్టుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

48 గంటల తర్వాత ఈ ఉపగ్రహాలు వాటి కక్ష్యలో చేరనున్నాయి. ఇంతకు ముందు ఒకసారి సరళరేఖలో ఉపగ్రహాల కదలికను చూశాం. మనిషికి హాని లేదు. అయితే దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, ఇలా సరళరేఖలో వచ్చే ఉపగ్రహాలు అధ్యయనానికి ఆటంకం కలిగిస్తాయి. ఈ కారణంగా ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. ఇంటర్నెట్ సౌకర్యం ఇప్పుడు ప్రాథమిక అవసరంగా మారింది. కాబట్టి ఈ తరహా ఉపగ్రహాన్ని ప్రయోగించడం అనివార్యం. ఈ ఉపగ్రహాల ద్వారా భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అతుల్ భట్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.