రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. వారి బ్యాగులు చెక్ చేయగా ఒళ్లు గగుర్పొడిచే సీన్..

వారి బ్యాగులు, వారి ప్రవర్తన పట్ల భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ విచారించగా, ఇద్దరూ మాట్లాడలేరు, వినలేరు, కేవలం సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. అనుమానంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారి బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో కనిపించిన దృశ్యం అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు సైతం అది చూసి కంగుతిన్నారు.  రైల్వే పోలీసులతో పాటు, స్టేషన్‌లోని ప్రయాణికులు అంతా నివ్వేరపోయారు.

రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు.. వారి బ్యాగులు చెక్ చేయగా ఒళ్లు గగుర్పొడిచే సీన్..
Suspicious Trolly Bag on Dadar Railway Station
Follow us

|

Updated on: Aug 06, 2024 | 3:07 PM

ఇద్దరు యువకులు చేతిలో పెద్ద ట్రాలీ బ్యాగ్‌తో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అతను టుటారి ఎక్స్‌ప్రెస్‌ పట్టుకోవలసి ఉంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగా నడుస్తున్నారు. అప్పుడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వారిని గమనించింది. సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఏం అడిగినా విచిత్రంగా సమాధానమిస్తున్నారు.. కేవలం సైగల ద్వారానే మాట్లాడటం కొనసాగించారు. వారి బ్యాగులు, వారి ప్రవర్తన పట్ల భద్రతా దళాలకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ విచారించగా, ఇద్దరూ మాట్లాడలేరు, వినలేరు, కేవలం సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. అనుమానంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారి బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో కనిపించిన దృశ్యం అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు సైతం అది చూసి కంగుతిన్నారు.  రైల్వే పోలీసులతో పాటు, స్టేషన్‌లోని ప్రయాణికులు అంతా నివ్వేరపోయారు. మహరాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్‌ వచ్చేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మహారాష్ట్రలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఆగస్టు 5 సోమవారం రోజున ఈ సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లో బ్యాగ్‌లో ఉన్న మృతదేహాన్ని ఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది దాదర్ రైల్వే స్టేషన్‌లో పెట్రోలింగ్‌లో ఉండగా వారి కళ్ళు ఒక వ్యక్తి తీసుకువెళుతున్న ట్రావెల్ బ్యాగ్‌పై పడ్డాయి. ఆ వ్యక్తి చర్యలపై అనుమానం రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని ఆపి బ్యాగ్‌ని సోదా చేశారు. ట్రావెల్ బ్యాగ్ తెరవగానే.. ఆర్పీఎఫ్ జవాన్లు షాక్ తిన్నారు. సైనికులు బ్యాగ్‌ని తెరిచి చూడగా అందులో రక్తంతో తడిసిన మృతదేహం కనిపించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేయగా.. మృతదేహం అర్షద్ అలీ అనే వ్యక్తిది అని తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రావెల్ బ్యాగ్‌ని తీసుకువెళుతున్న వ్యక్తిని జై ప్రవీణ్ చావ్డా, అతని సహచరుడు శివజిత్ సురేంద్ర సింగ్‌గా గుర్తించారు. మృతుడు, నిందితులు ఇద్దరూ వినలేరు, మాట్లాడలేరు అని తెలిసింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు సంకేత భాషా నిపుణుడిని పిలిపించి.. అప్పుడే హత్యకు గల కారణం తెలిసింది.

ఇవి కూడా చదవండి

అసలు విషయం ఏమిటంటే..

పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం, నిందితులిద్దరూ శాంతా క్రజ్‌లో నివసిస్తున్న అర్షద్ అలీ షేక్‌ను హత్య చేశారు. తరువాత వారు ఆ మృతదేహాన్ని పడేసేందుకు గానూ టుటారీ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించబోతున్నారు. అయితే అంతకు ముందే పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు శివజిత్ సురేంద్ర సింగ్‌కు, మృతునికి మధ్య అతని స్నేహితురాలి విషయంలో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.

ముంబయిలోని పిధుని ప్రాంతంలోని తమ ఇంటికి పార్టీ కోసం నిందితులు మృతుడు అర్షద్‌ అలీని ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీ మధ్యలోనే ఆ అమ్మాయి విషయపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిందితులు అర్షద్ అలీని హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని పడవేసేందుకు సూట్‌కేస్‌లో ప్యాక్ చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, రక్తం బయట పడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ప్లాస్టిక్‌తో ప్యాక్‌ చేశారు. అయితే బ్యాగ్ చెకింగ్ ఆపరేషన్‌లో పోలీసులు వారిని పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు..
రైల్వే స్టేషన్‌లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు..
అల్లర్లతో తగలబడుతోన్న ఢాకా.. సర్కార్ ఏర్పాటులో ఆర్మీ!
అల్లర్లతో తగలబడుతోన్న ఢాకా.. సర్కార్ ఏర్పాటులో ఆర్మీ!
హైదరాబాద్‌లో రేండేళ్లు నడిచిన సినిమా.. ఆ కళా ఖండానికి 30 ఏళ్లు..
హైదరాబాద్‌లో రేండేళ్లు నడిచిన సినిమా.. ఆ కళా ఖండానికి 30 ఏళ్లు..
ట్రెండీ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఫొటో
ట్రెండీ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఫొటో
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్‌కు అరుదైన గౌరవం.. అదేంటంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్‌కు అరుదైన గౌరవం.. అదేంటంటే?
వృద్ధురాలి పాలిట శాపంగా మారిన To-Let బోర్డు
వృద్ధురాలి పాలిట శాపంగా మారిన To-Let బోర్డు
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో 15 వేల ఐటీ ఉద్యోగాలు
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో 15 వేల ఐటీ ఉద్యోగాలు
ఎక్కువ కాలం యంగ్‌గా ఉండాలా.. ఇలా చేయండి..
ఎక్కువ కాలం యంగ్‌గా ఉండాలా.. ఇలా చేయండి..
సిటాడెల్‌ కి సూపర్‌ రెస్పాన్స్.! అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..
సిటాడెల్‌ కి సూపర్‌ రెస్పాన్స్.! అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..
ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య