Navneet Rana: సోషల్ మీడియాలో ఎంపీ నవనీత్ రాణా MRI స్కాన్ ఫోటో.. లీలావతి ఆసుపత్రికి నోటిసులు జారీ

హనుమాన్ చాలీసా వివాదంలో అమరావతి ఎంపీ నవనీత్ రాణాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన రాణా నేరుగా లీలావతి ఆసుపత్రిలో చేరారు.

Navneet Rana: సోషల్ మీడియాలో ఎంపీ నవనీత్ రాణా MRI స్కాన్ ఫోటో.. లీలావతి ఆసుపత్రికి నోటిసులు జారీ
Navneet Rana
Follow us

|

Updated on: May 10, 2022 | 4:05 PM

Navneet Rana: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇల్లు మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా చదివినందుకు అమరావతి ఎంపీ నవనీత్ రాణాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన రాణా నేరుగా లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎంఆర్‌ఐ పరీక్ష కూడా ఉంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి చిత్రాలను కొందరు సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఇప్పుడు ఆ చిత్రాల కారణంగానే వివాదం నెలకొంది.

లీలావతి ఆసుపత్రిలో చేరినప్పుడు ఎంఆర్‌ఐ పరీక్ష సమయంలో, పరీక్ష సమయంలో రాణా ఎంఆర్ఐ స్కానింగ్ చిత్రాలను ఎవరో లీక్ చేశారని రాణా ఆరోపించారు. తర్వాత రాణా దంపతులు ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు శివసేన వారిని చుట్టుముట్టింది.

ఈ విషయమై మేయర్ కిషోరీ పెడ్నేకర్ లీలావతి ఆసుపత్రి సిబ్బందిని వివరణ కోరారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలోని ఎంఆర్‌ఐ గదిలో ఎలాంటి ఫోటోలు తీయడం, లోహపు వస్తువులు తీయడం నిషేధమని తెలిపారు. అప్పుడు మొబైల్ ఫోన్‌తో అక్కడికి వెళ్లింది ఎవరు? ఇందు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాలని మేయర్ కోరారు. కాగా, తమ భద్రతా సిబ్బంది ఆయుధాలతో ఆసుపత్రిలో ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని శివసేన నేతలు ఆరోపించారు. ఆయుధంతో ఆసుపత్రి సెక్యూరిటీ గార్డును ఎలా లోపలికి అనుమతించారని ప్రశ్నించారు. BMC కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ లీలావతి ఆసుపత్రి నిర్వాకంపై నివేదిక కోరారు. మరోవైపు, మంగళవారం, శివసేన శాసన మండలి ఎమ్మెల్యే మనీషా కయాండే బాంద్రా హిల్ రోడ్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఉదయం 9 గంటలకు ఫిర్యాదు చేశారు.