AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Shock: వీడెవడండి బాబు.. యజమానిపై కోపంతో కరెంట్ షాక్ ఇచ్చాడు

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని యజమాని దురుసు ప్రవర్తన నచ్చకపోవడంతో ఓ వంట మనిషి తనకు విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ వంట మనిషి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అసలు విషయం తెలుసుకోవాల్సింది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. బేత్‌షీబా సేథ్‌ అనే మహిళ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది.

Electric Shock: వీడెవడండి బాబు.. యజమానిపై కోపంతో కరెంట్ షాక్ ఇచ్చాడు
Electric Shock
Aravind B
|

Updated on: Sep 19, 2023 | 7:57 PM

Share

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని యజమాని దురుసు ప్రవర్తన నచ్చకపోవడంతో ఓ వంట మనిషి తనకు విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ వంట మనిషి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అసలు విషయం తెలుసుకోవాల్సింది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. బేత్‌షీబా సేథ్‌ అనే మహిళ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే తన ఇంట్లో వంట చేయడానికి ఆమె రాజు సింగ్‌ అనే ఒక వ్యక్తిని నియమించుకుంది. అయితే అతడు పని సరిగా చేయటం లేదని ఆమె ఓ సారి అతడిపై దురుసుగా ప్రవర్తించింది. దీంతో రాజు సింగ్‌ ఆమె అతనిపై అలా ప్రవర్తించడం తట్టుకోలేకపోయాడు. ఆ యజమానిపై కోపం పెంచుకున్నాడు.

అయితే ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం పూట ఆమె నివసించే ఫ్లాట్‌కు వెళ్లాడు రాజ్ సింగ్. తన దగ్గర ఉన్నటువంటి అదనపు తాళం చెవితో ఇంటి తలుపులు తెరిచేశాడు. అయితే ఆ సమయంలో బేత్‌షీబా సేథ్‌ నిద్ర పోతోంది. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారంగానే.. ఆ వంట మనిషి రాజు సింగ్‌ విద్యుత్ బోర్డులోని సాకెట్‌లో వైర్లు ఉంచి ఓ సారి ఆమెకు ఒక్కసారిగా కరెంటు షాక్‌ ఇచ్చాడు. దీంతో ఆమె ఉలిక్కిపడి లేచింది. ఏమైందోనని చుట్టుపక్కల చూసింది. అయితే ఆమె నిద్ర లేవగానే ఇప్పుడు ఎలా ఉందంటూ ఆ నిందితుడు ఆమెను ప్రశ్నించాడు. అంతేకాదు ఆమెపై అలా వరుసగా కొన్నిసార్లు షాక్ ఇచ్చాడు. దీంతో సేథ్ ఆ కరెంట్ షాక్ చిత్రహింసలను భరించలేకపోయింది. ఇక రాజు సింగ్‌తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుండగా.. రాజు సింగ్ ఆమె గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు.

అయితే ఈ బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆ అరుపులు విని పక్క గదిలో నిద్రపోతున్న ఆమె కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అయితే ఆ వంట మనిషి తన కొడుక్కి కూడా ఏదైనా హాని చేస్తాడేమోనని అనుకుని ఆ బాలుణ్ని ఇక్కడి నుంచి పారిపొమ్మని చెప్పింది . అయితే కొద్ది సేపటి తర్వాత ఆ నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పాడు. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ దాడి గురించి సేథ్‌ తన స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో వెంటనే వారు ఆమె ఫ్లాట్‌ వద్దకు వచ్చేశారు. ఇక చివరికి ఈ ఘటనపై అంబోలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు
యాడ్ షూట్ పై బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కామెంట్స్‌..అల్లు అర్జున్ టీమ్
యాడ్ షూట్ పై బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కామెంట్స్‌..అల్లు అర్జున్ టీమ్
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా
ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా
భూమి లోపల ఇంకా ఎంత బంగారం ఉంది.. ఇప్పటివరకు ఎంత తవ్వామో తెలుసా..?
భూమి లోపల ఇంకా ఎంత బంగారం ఉంది.. ఇప్పటివరకు ఎంత తవ్వామో తెలుసా..?
అల్లాదుర్గంలో చిరుత కలకలం.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు
అల్లాదుర్గంలో చిరుత కలకలం.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా