AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dawood Ibrahim: వేలానికి దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..! జనవరి 5న వేలంలో విక్రయించనున్న దావూద్‌ ఆస్తులు

1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు వేలం పాట వేయనున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న అతని ఇంటితోపాటు మరో మూడు ఆస్తులను వచ్చే శుక్రవారం వేలం పాట నిర్వహించున్నారు. ముంబాకే గ్రామంలోని అతనికి చెందిన మొత్తం 4 ఆస్తులను అధికారులు అమ్మకానికి ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి..

Dawood Ibrahim: వేలానికి దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..! జనవరి 5న వేలంలో విక్రయించనున్న దావూద్‌ ఆస్తులు
Dawood Ibrahim
Srilakshmi C
|

Updated on: Jan 03, 2024 | 8:09 AM

Share

న్యూఢిల్లీ, జనవరి 3: 1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు వేలం పాట వేయనున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న అతని ఇంటితోపాటు మరో మూడు ఆస్తులను వచ్చే శుక్రవారం వేలం పాట నిర్వహించున్నారు. ముంబాకే గ్రామంలోని అతనికి చెందిన మొత్తం 4 ఆస్తులను అధికారులు అమ్మకానికి ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్మగ్లర్స్‌ అండ్‌ ఫారెన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మానిప్యులేటర్స్‌ (ఆస్తి జప్తు) యాక్ట్‌ (SAFEMA) కింద దావూద్‌ ఆస్తులన్నింటినీ అధికారులు సీజ్‌ చేశారు.

SAFEMA ప్రకారం.. రత్నగిరిలో ఉన్న దావూద్‌కు చెందిన రూ.19 లక్షల విలువ చేసే మొత్తం 4 ప్లాట్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు దావూద్ ఆస్తులను అమ్మకానికి పెట్టినప్పటికీ అతనికి భయపడి ఎవరూ వాటిని కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇప్పుడు వాటిని వేలం వేయాలని SAFEMA నిర్ణయించింది. ఆస్తుల వేలం జనవరి 5వ తేదీన ముంబైలో జరగనుంది. నేటితో రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. గత తొమ్మిదేళ్లలో దావూద్ కుటుంబానికి చెందిన 11 ఆస్తులను వేలం వేసిన సంగతి తెలిసిందే. రూ. 3.52 కోట్ల గెస్ట్ హౌస్‌తో సహా రూ 4.53 కోట్లకు రెస్టారెంట్, రూ 3.53 కోట్లకు ఆరు ఫ్లాట్‌లను విక్రయించారు.

1993 ముంబై వరుస పేలుళ్లలో కీలక నిందితుడైన దావూద్ ఇబ్రహీం 1983లో ముంబైకి వెళ్లడానికి ముందు ముంబకే గ్రామంలో నివసించాడు. మార్చి 12, 1993న ముంబై (అప్పటి బొంబాయి) వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణానికి దారితీసింది. 700 మందికి పైగా గాయపడ్డారు. సుమారు రూ. 27 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. జూన్ 16, 2017న ముస్తఫా దోస్సా, అబూ సలేంతో సహా అనేక మంది నిందితులు ఈ కేసులో దోషులుగా నిర్ధారించబడ్డారు. వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు రుజువైంది. దీంతో అతను భారతదేశాన్ని విడిచి పాక్‌కు పారిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!