Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: వణికిస్తోన్న చలిపులి.. నేటి నుంచి శనివారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌

ఉత్తర భారతదేశంలో చలిగాలుల తీవ్రరూం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో నోయిడాలోని పాఠశాలలు 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. జనవరి 3 నుంచి 6 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా యంత్రాంగం మంగళవారం (జనవరి 2) ప్రకటించింది. వాతావరణ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో..

Uttar Pradesh: వణికిస్తోన్న చలిపులి.. నేటి నుంచి శనివారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌
Noida Schools Shut
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2024 | 8:40 AM

న్యూఢిల్లీ, జనవరి 3: ఉత్తర భారతదేశంలో చలిగాలుల తీవ్రరూం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో నోయిడాలోని పాఠశాలలు 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. జనవరి 3 నుంచి 6 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా యంత్రాంగం మంగళవారం (జనవరి 2) ప్రకటించింది. వాతావరణ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ఇప్పటికే డిసెంబర్ 29 , 30 తేదీలలో నగరంలోని అన్ని పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. కొత్త ఏడాది తొలి రెండు రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. జనవరి 3 నుంచి పశ్చిమ యూపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఢిల్లీలో ఉదయం వేలల్లో బలమైన చలి గాలులు వీస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది. వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు కారణంగా ఢిల్లీకి వచ్చే 26 రైళ్లు ఒకటి నుంచి ఆరు గంటలు ఆలస్యంగా నడవనున్నట్లు ప్రకటించాయి. ఉదయం 6.30 గంటల సమయంలో గాలి నాణ్యత సూచిక (AQI) 346 ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా పేర్కొంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కనిపించింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని చోట్ల, పశ్చిమ ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల చలిగాలులు వీస్తున్నట్లు లక్నోలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, మీరట్, అయోధ్య, లక్నో, ఆగ్రా, మీరట్ డివిజన్‌లతో సహా ఇతర డివిజన్‌లలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే చాలా తక్కువగా నమోదైంది. ఆ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత షాజహాన్‌పూర్‌లో 5.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బండలో అత్యధికంగా 22.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?