AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మార్ట్‌ఫోన్ యూజర్లు, ఇంటర్నెట్ వాడకందారులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..!

స్మార్ట్‌ఫోన్ యూజర్లు, ఇంటర్నెట్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంటర్నెట్ డేటా వాడకంపై కొత్తగా ట్యాక్స్ వేసే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జనవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన టెలికాం రివ్యూ మీటింగ్‌లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్ యూజర్లు, ఇంటర్నెట్ వాడకందారులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..!
Mobile Data Usage Tax
Balaraju Goud
|

Updated on: Mar 12, 2026 | 7:14 AM

Share

స్మార్ట్‌ఫోన్ యూజర్లు, ఇంటర్నెట్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంటర్నెట్ డేటా వాడకంపై కొత్తగా ట్యాక్స్ వేసే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జనవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన టెలికాం రివ్యూ మీటింగ్‌లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రజల్లో స్క్రీన్ అడిక్షన్‌ను తగ్గించాడానికి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఒక అంచనా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 229 బిలియన్ జీబీల డేటాను జనాలు వాడేశారు. ఈ లెక్కన ప్రతి జీబీ వాడకంపై ఒక్క రూపాయి చొప్పున ట్యాక్స్ వేసినా.. ఏటా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 22 వేల 900 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం టెలికాం సేవలపై 18 శాతం GST కడుతున్నాం. ఈ కొత్త ట్యాక్స్ వస్తే అది సామాన్యుల జేబులకు అదనపు భారం కానుంది. ఒక నిర్దిష్ట డేటా లిమిట్ దాటిన తర్వాతే ఈ ట్యాక్స్ పడుతుందనే ప్రచారం జరుగుతున్నా..అలాంటి స్లాబ్ సిస్టమ్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఈ ట్యాక్స్ అమలు ఎంతవరకు సాధ్యం అన్నదానిపై సాధ్యాసాధ్యాలను స్టడీ చేయాలని టెలికాం డిపార్ట్‌మెంట్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ ట్యాక్స్ వసూలు విధానంపై సెప్టెంబర్ 2026 నాటికి టెలికాం శాఖ..ప్రభుత్వానికి పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us