AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohini Court Blast: ఉలిక్కిపడిన దేశ రాజధాని.. ఢిల్లీ కోర్టులో పేలుడు.. రంగంలోకి దిగిన పోలీసులు..

ఢిల్లీలో పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు పరిసరాలు ఒక్కసారిగా వణికిపోయాయి. అంతా పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలియక..

Rohini Court Blast: ఉలిక్కిపడిన దేశ రాజధాని.. ఢిల్లీ కోర్టులో పేలుడు.. రంగంలోకి దిగిన పోలీసులు..
Blast
Sanjay Kasula
|

Updated on: Dec 09, 2021 | 12:35 PM

Share

ఢిల్లీలో పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు పరిసరాలు ఒక్కసారిగా వణికిపోయాయి. అంతా పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలియక హడలిపోయారు. వెంటనే రంగంలోకి దిగన పోలీసులు ల్యాప్‌టాప్ బ్యాటరీ పేలినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఉదయం 11 గంటల సమంయలో రోహిణి కోర్డు పరిసరాల్లో ఓ గదిలో ఈ పేలుడు జరిందని వెల్లడించారు. కోర్టు రూమ్ నంబర్ 102లో స్కూల్ బ్యాగ్‌లో ఉంచిన ల్యాప్‌టాప్ పేలింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు.  ల్యాప్‌టాప్ నేలపై పడి ఉన్న వీడియోలు, పోలీసు సిబ్బంది చుట్టూ తిరుగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ల్యాప్‌టాప్ బ్యాటరీలో టెక్నికల్ సమస్యల వల్ల పేలుడు సంభవించిందిని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపివేసి.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఫోరెన్సిక్, క్రైమ్ బృందాలు సంఘటన స్థలానికి చేరకున్నాయి. విచారణ మొదలు పట్టాయి.

ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..