MIG-21 Crash: ఒక్క రూపాయితో పెళ్ళిచేసుకున్న పైలట్ అభినవ్ చౌదరి..మిగ్-21 ప్రమాదంలో దుర్మరారణం

MIG-21 Crash: భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 యుద్ధ విమానం పంజాబ్‌లోని మోగాలో గురువారం రాత్రి కుప్పకూలిన విషయం తెలిసిందే.

MIG-21 Crash: ఒక్క రూపాయితో పెళ్ళిచేసుకున్న పైలట్ అభినవ్ చౌదరి..మిగ్-21 ప్రమాదంలో దుర్మరారణం
Mig 21 Crash
Follow us

|

Updated on: May 21, 2021 | 4:00 PM

MIG-21 Crash: భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 యుద్ధ విమానం పంజాబ్‌లోని మోగాలో గురువారం రాత్రి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ అభినవ్ చౌదరి తన ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు 17 నెలల ముందే వివాహం జరిగింది. అభినవ్ పెళ్లి అప్పట్లో పెద్ద వార్తాంశంగా మారింది. తనకు వధువు తల్లిదండ్రులు ఇస్తానని చెప్పిన వరకట్నం నిరాకరించి.. వారి బలవంతం మేరకు కేవలం ఒక్కరూపాయి కానుకగా తీసుకున్నారు అభినవ్ చౌదరి. ఈయన వివాహం అలా వార్తల్లో నిలవడంతో పాటు అందరూ ఆయనను అభినందించారు. వివాహంలో వరకట్నానికి ఎటువంటి అవకాశం ఉండకూడదని అప్పుడు ఆయన చెప్పారు. రెండు కుటుంబాలను కలపడానికి కట్నాలవంటి లావాదేవీలు అవసరం లేదని చెప్పిన అభినవ్ చౌదరి వరకట్న వ్యవస్థను ఆపాలని గట్టిగా కోరుకున్నారు. ఇప్పుడు ఈ ఘోర ప్రమాదంలో అభినవ్ మరణించడం అందరినీ కలచివేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లాలోని బరోట్-బుధ్నా రోడ్‌లోని పుసార్ గ్రామంలో గంగాసాగర్ కాలనీలో అభినవ్ చౌదరి నివసిస్తున్నారు. ఆయన తండ్రి సతేంద్ర చౌదరి ఒక రైతు. అభినవ్‌కు 25 డిసెంబర్ 2019 న మీరట్‌లో వివాహం జరిగింది. అభినవ్ భార్య సోనికా ఉజ్జ్వాల్ ఫ్రాన్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదివారు. అభినవ్ చౌదరిని ఈ రోజుల్లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో పోస్ట్ చేశారు. ఐఐఎంసి డెహ్రాడూన్‌లో 12 వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. దీని తరువాత, అతని ఎంపిక ఎన్డీఏలో జరిగింది. పూణేలో మూడేళ్ల తరువాత హైదరాబాద్‌లోని ఎఎఫ్‌ఎలో వైమానిక దళం శిక్షణ పూర్తి చేశాడు. అభినవ్ తల్లి సత్య చౌదరి గృహిణి కాగా, చెల్లెలు ముద్రికా చౌదరికి పెళ్ళికావలసి ఉంది.

ప్రమాదం జరిగిన 4 గంటల తర్వాత పైలట్ అభినవ్ మృతదేహం కనుగొనబడింది , మోగా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాఘపురానా గ్రామమైన లాంగియానా ఖుర్ద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం పడటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పై ఎస్పీ గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ, శిక్షణా కార్యక్రమంలో భాగం పైలట్ అభినవ్ చౌదరి మిగ్ -21 విమానంలో రాజస్థాన్‌లోని సూరత్ గడ్ కు బయలుదేరారు. అయితే ఈ విమానం మోగాలో కుప్పకూలింది. విమానం కూలిన ప్రదేశంలో అభినవ్ చౌదరి కనిపించక పోవడంతో ప్యారాచూట్ సహాయంతో ఎక్కడన్నా దిగి ఉండవచ్చని భావించారు. అయితే, 4 గంటల ప్రయత్నం తరువాత, పైలట్ అభినవ్ చౌదరి మృతదేహం పొలంలో కనుగొన్నారు. విమానం కూలిపోతున్నట్లు అభినవ్‌కు ముందే తెలిసినట్టు అర్ధం అవుతోంది. అందుకే ఆయన ముందుగానే ఎగురుతున్న విమానం నుంచి కిందికి దూకారు. అయితే, ఆ సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో కిందపడిన సమయంలో ఆయన మెడ విరిగిపోయింది. దాంతో ఆయన మృతి చెంది ఉంటారని ప్రాధమికంగా నిర్ధారించారు.

Also Read: MIG-21: పంజాబ్ రాష్ట్రంలో కూలిపోయిన శిక్షణలో ఉన్న మిగ్ 21 విమానం.. తీవ్రంగా గాయపడిన పైలెట్..

Migrant Workers: నేపాల్ లో చిక్కుకున్న 26 మంది వలస కార్మికులు.. తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జార్ఖండ్ ప్రభుత్వం!