AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్నలిస్ట్ ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్ కేసు, తీర్పును ఈ నెల 17 కి వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు

జర్నలిస్టు ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసు (పరువునష్టం దావా) పై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 17 కి వాయిదా వేసింది.

జర్నలిస్ట్ ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్ కేసు, తీర్పును ఈ నెల 17 కి వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు
Umakanth Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 10, 2021 | 5:08 PM

Share

జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసు (పరువునష్టం దావా) పై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 17 కి వాయిదా వేసింది. అక్బర్ తనను లైంగికంగా వేధించారని ప్రియా రమణి ఆరోపిస్తూ..ఆయనపై లోగడ కేసు పెట్టడం, ఈ ఆరోణలను ఆయన నిరాధారమైనవిగా పేర్కొంటూ ఆమెపై పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. వీరిద్దరి వాదనలు ఆలకించిన అనంతరం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీందర్ కుమార్ తన తీర్పును ఈనెల 1 న రిజర్వ్ లో ఉంచారు. కాగా బుధవారం ఈ కేసును విచారించిన కోర్టు.. వీరు లిఖితపూర్వక వాదనలను ఆలస్యంగా సమర్పించారని పేర్కొంది. ఉభయ పక్షాల నుంచి ఈ సబ్ మిషన్లు అందడంలో జాప్యం జరిగినందున ఈ నెల 17 న తీర్పు ప్రకటిస్తామని తెలిపింది.

2018 లో మీ టూ ఉద్యమ నేపథ్యంలో అక్బర్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ ప్రియా రమణి ఆయనపై పిటిషన్ వేశారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేందుకే ఆమె ఈ నింద వేస్తోందని అంటూ అక్బర్ కూడా ఆమెపై కేసు పెట్టారు. 2018 అక్టోబర్ 15 న ఆయన పరువు నష్టం దావా వేశారు. అదే ఏడాది అదే నెల 17 న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

నాడు మీ టూ ఉద్యమం ప్రబలంగా ఉన్నప్పుడు కొందరు  మహిళలు కూడా అక్బర్ పట్ల ఆరోపణలు చేశారు. కాగా బుధవారం ఉదయం అక్బర్, రమణి తమ లాయర్లతో కోర్టుకు చేరుకున్నారు. అక్బర్ తరఫున సీనియర్ న్యాయవాది గీతా లూథ్రా, ప్రియా రమణి తరఫున రెబెకా జాన్ వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. నాడు అక్బర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా రమణి  ఓ ఆర్టికల్ రాశారు. అక్బర్  ఇంటర్వ్యూ కోసం ఓ  హోటల్ కి తాను వెళ్ళినప్పుడు ఆయన తనను లైంగికంగా వేధించారని ఆమె ఈ ఆర్టికల్ లోపేర్కొంది. అప్పుడు అక్బర్ ఓ నేషనల్ డైలీకి ఎడిటర్ గా ఉన్నారు. కాగా- అక్బర్ ను ఉద్దేశించే ఈ ఆర్టికల్ రాశానని రమణి ఆ తరువాత ట్వీట్ చేసింది.

Read More:ఉత్తరాఖండ్ విషాదం, ఇస్రో తీసిన ఇమేజీల్లో కళ్ళకు కట్టిన ప్రకృతి విలయం, అదే బీభత్సం .

Read More: ‘క్రోనీ జీవీ హై వో’, ‘దేశాన్నే వాళ్లు అమ్మేస్తున్నారు’, ప్రధాని మోదీ వ్యాఖ్యపై రాహుల్ గాంధీ ఫైర్

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ