Mandai Metro Station: మెట్రో స్టేషన్లో అగ్నిప్రమాదం.. ఆరు ఫైరింజన్లతో మంటలార్పిన సిబ్బంది
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మెట్రోస్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కానీ, ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.

Fire At Metro Station
మహారాష్ట్ర పుణెలోని ఒక మెట్రో స్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహాత్మా ఫూలే మండై ప్రాంతంలోని మెట్రో స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ వీడియో చూడండి..
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మెట్రోస్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కానీ, ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
Follow Us




