AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ మందిర్ ట్రస్ట్ సమావేశానికి ముందు.. కలకలం సృష్టిస్తున్న ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ లేఖ..!

అయోధ్య రామ మందిరంలో జరిగిన దొంగతనం ఘటనపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఈ పాపానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని, వారికి అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

రామ మందిర్ ట్రస్ట్ సమావేశానికి ముందు.. కలకలం సృష్టిస్తున్న ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ లేఖ..!
Mahant Nritya Gopal Das
Balaraju Goud
|

Updated on: Jul 06, 2026 | 12:48 PM

Share

అయోధ్య రామ మందిరంలో జరిగిన దొంగతనం ఘటనపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఈ పాపానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని, వారికి అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

లిఖితపూర్వక ప్రకటన విడుదల చేసిన మహంత్ నృత్య గోపాల్ దాస్, రామ మందిరం కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని, ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. ఈ కేసులో నిందితులను త్వరగా గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా, విశ్వాసానికి సంబంధించిన అంశంగా చూడాలని మహంత్ నృత్య గోపాల్ దాస్ పిలుపునిచ్చారు. దర్యాప్తు పూర్తయ్యాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, చట్టం తన పని తాను చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us