AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాల్పులతో మార్మోగిన గచ్చిరోలి

మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా గురువారం సాయంత్రం కాల్పులతో మార్మోగింది. చాలా రోజుల తర్వాత.. మావోయిస్టలకు, భద్రతా బలగాలకు మధ్య బీకర పోరు చోటుచేసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం నాడు ఓ సీనియర్ పోలీసు..

కాల్పులతో మార్మోగిన గచ్చిరోలి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2020 | 6:39 PM

Share

మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా గురువారం సాయంత్రం కాల్పులతో మార్మోగింది. చాలా రోజుల తర్వాత.. మావోయిస్టలకు, భద్రతా బలగాలకు మధ్య బీకర పోరు చోటుచేసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం నాడు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లాలోని కొర్చి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. అటుగా తారసపడ్డ మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎదురు కాల్పులకు దిగారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరుపుతూ.. అక్కడే ఉన్న దట్టమైన అడవులకు పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని పోలీసులు తెలిపారు.

కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమ నేత చారు మంజుందర్ జ్ఞాపకార్థం ఈ నెల జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ‘‘అమరవీరుల వారం’’గా పాటించాలంటూ పోస్టర్లు వెలిసినట్లు సమాచారం. మసేలీ- నవార్గాన్ దారిలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయని అధికారులు వెల్లడించారు.