Speed on Highways: హైవే కదా అని వేగంగా వెళ్ళారంటే చిక్కులు తప్పవు.. జాతీయరహదారులపై ఎంత వేగం వరకూ వెళ్ళొచ్చు అంటే..

కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబర్ 16 న, మధ్యప్రదేశ్‌లోని రత్లం జిల్లాలో ఉన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేని పరీక్షించడానికి, ఆయన తన కియా కార్నివాల్ వాహనాన్ని 170 కి.మీ వేగంతో నడిపారు.

Speed on Highways: హైవే కదా అని వేగంగా వెళ్ళారంటే చిక్కులు తప్పవు.. జాతీయరహదారులపై ఎంత వేగం వరకూ వెళ్ళొచ్చు అంటే..
Speed On Highway
Follow us

|

Updated on: Oct 04, 2021 | 7:46 AM

Speed on Highways: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబర్ 16 న, మధ్యప్రదేశ్‌లోని రత్లం జిల్లాలో ఉన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేని పరీక్షించడానికి, ఆయన తన కియా కార్నివాల్ వాహనాన్ని 170 కి.మీ వేగంతో నడిపారు. అప్పుడు ఆ వీడియోవైరల్ అయింది. కేంద్ర ప్రభుత్వ నియమాలు గంటకు 120 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అనుమతించనప్పుడు, గడ్కరీ దీనిని ఎందుకు ప్రయత్నించారు అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. అయితే, ఇది పరీక్షకు సంబంధించిన విషయం. అందువల్ల వేగంగా వెళ్లడంపై పెద్దగా అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటె.. గత వారం, మద్రాస్ హైకోర్టు ఒక కేసు విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగా హైవేపై వేగ పరిమితులపై చర్చ మళ్ళీ తలెత్తింది. గంటకు 120 కిమీ వేగాన్ని అనుమతించే కేంద్ర మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను హైకోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు రూలింగ్ ప్రకారం ఇప్పుడు మీరు హైవేలో 80 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకోలేరు. మీరు మీ కారును రాష్ట్ర రహదారి లేదా జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై నడుపుతున్నా సరే మీరు 80 కిలోమీటర్ల స్పీడ్ దాటి వెళ్ళలేరు.

మద్రాస్ హైకోర్టు నిర్ణయం ఏమిటి?

ఈ కేసు 2013 లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించినది. వాస్తవానికి, ఒక మహిళ ద్విచక్ర వాహనం నడుపుతుండగా బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం తరువాత, మహిళ 90% వైకల్యానికి గురైంది. దీనికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా, మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్ ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 120 కిమీ వేగంతో కార్లను నడపడానికి అనుమతిస్తుంది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు వేగ పరిమితిని పెంచాలన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వ నిర్ణయాల గురించి ఒకసారి పరిశీలిస్తే.. 2014 లో ప్రభుత్వం గంటకు 80 కిమీ వేగ పరిమితిని నిర్ణయించింది. తరువాత ఇది క్రమంగా 100 కిమీ/గం వరకు పెరిగింది. 2018 లో, వేగ పరిమితికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ వచ్చింది మరియు దీనిలో కొన్ని వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 120 కిమీ వేగవంతం చేయడానికి అనుమతించారు.

మద్రాస్ హైకోర్టు వేగంపై ఏమి చెబుతోంది?

ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని హైకోర్టు చెబుతోంది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి అతివేగం. సాధారణ రోడ్ల నుండి ఎక్స్‌ప్రెస్‌వేల వరకు ప్రజలు వేగ పరిమితిని ఉల్లంఘిస్తున్నారు. దీని కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం రోడ్డు మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని కోర్టుకు చెప్పింది. కానీ, ప్రభుత్వ వాదనలను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. రోడ్డు మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని చెప్పారు. ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉందన్నారు. ఇంజిన్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. కానీ, ప్రమాదాలు తగ్గాయని చెప్పలేము. ఈ సందర్భంలో, వేగాన్ని నియంత్రించడం అవసరం అని కోర్టు అభిప్రాయపడింది. స్పీడ్ గన్స్, స్పీడ్ ఇండికేషన్ డిస్‌ప్లేలు, డ్రోన్‌లను ఉపయోగించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. తద్వారా అతివేగం ఉన్న వారిని వెంటనే పట్టుకోవచ్చు. దీనికి పాల్పడిన డ్రైవర్లను శిక్షించాలి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లకు కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు.

భారతదేశంలో గంటకు 120 కిమీ వేగాన్ని అందుకోగలమా?

అవును. కానీ ఈ వేగ పరిమితి కొన్ని వాహనాలకు మాత్రమే. వీటిలో ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి. వీటిలో 8 కంటే తక్కువ మంది ప్రయాణికులు ఉంటారు. అంటే, కార్ల నుండి SUV ల వరకు, ప్యాసింజర్ కార్లు మాత్రమే 120 km / h వేగాన్ని అందుకోగలవు. అది కూడా ఎక్స్‌ప్రెస్‌వేపై. జాతీయ రహదారు, ఇతర రహదారులకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అదే సంవత్సరంలో, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వేగ పరిమితిని గంటకు 20 కిమీకి పెంచాలని వాదించారు. అదేవిధంగా రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులు కూడా వేగ పరిమితులను సెట్ చేయవచ్చు. దీని కారణంగా, ఒకే హైవేలోని ఒక విభాగంలో వేర్వేరు వేగ పరిమితులను గమనించాల్సి ఉంటుంది. ఇది క్లిష్టమైనదిగా మారింది. భారతదేశంలో వేగ పరిమితి తక్కువ. ఇతర దేశాలలో ఎక్కువ అని కాదు. మద్రాస్ హైకోర్టు నిర్ణయానికి ముందు యూకే, యూఎస్, చైనా వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో వేగ పరిమితులు పెద్దగా భిన్నంగా లేవు. ఇప్పుడు హైకోర్టు నిర్ణయం తర్వాత పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది.

కార్ల వేగం నిజంగా ప్రాణాంతకంగా మారుతోందా?

అవును. ఎన్‌సిఆర్‌బి యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2019 నివేదిక దీనిని ధృవీకరిస్తోంది. 2019 లో 1.54 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఇందులో, 86 వేలకు అంటే 55.7% మరణాలు అధిక వేగం వల్ల మరియు 42 వేల అనగా 27.5% మరణాలు నిర్లక్ష్యంగా నడపడం లేదా ఓవర్‌టేక్ చేయడం వల్ల సంభవించాయి. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

మీ వేగం-ప్రమాదాలలో మరణాల మధ్య సంబంధం ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 లో ఒక నివేదికను తయారు చేసింది. కారు వేగం ఎంత ఎక్కువగా ఉందో, అది ఆపడానికి ఎక్కువ దూరం పడుతుందని ఇది చెబుతోంది. గంటకు 50 కిమీ వేగంతో కారును ఆపడానికి 13 మీటర్లు పడుతుంది. అదే సమయంలో, 40 కిమీ / గం వేగంతో వెళ్తున్న కారును 8.5 మీటర్లలో ఆపవచ్చు. 1 కి.మీ/గం సగటు వేగాన్ని పెంచడం వలన గాయం ప్రమాదం 4-5%పెరుగుతుంది. అదేవిధంగా, ఈ ప్రమాదాలలో మరణించే అవకాశం 3%పెరుగుతుంది. వేగం కారణంగా ప్రభావం కూడా పెరుగుతుంది. గంటకు 80 కి.మీ వేగంతో కారు ఢీకొంటే, 30 కి.మీ/గంట వేగంతో ఢీకొన్న ప్రమాదానికి 20 రెట్లు ఎక్కువ. వేగం, గాయాల తీవ్రత మధ్య సంబంధం కూడా ముఖ్యమైనది ఎందుకంటే వీరిలో ఎక్కువమంది బాధితులు పాదచారులు.. సైక్లిస్టులు. గంటకు 30 కి.మీ వేగంతో కారు ప్రయాణికులను ఢీకొంటే, వారి మనుగడ అవకాశాలు 90% ఎక్కువ. కారు 45 km/h వేగంతో ఢీకొంటే, బతికే అవకాశాలు 50%కి తగ్గుతాయి. ఇంకా ఏమిటంటే, వేగం 80 కిమీ/గం వరకు పెరిగితే, బతికే అవకాశం లేదు.

కాబట్టి హైవేలో వేగాన్ని పెంచడం సురక్షితమేనా?

చెప్పలేం.. రహదారులను మెరుగుపరిచినప్పటికీ లేదా ఇంజిన్ సాంకేతికతను మెరుగుపరిచినప్పటికీ, రోడ్డు ప్రమాదాలలో మరణాలు తగ్గడం లేదని హైకోర్టు పేర్కొంది. ఇంకా ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల మరణాలలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వాటా ఇతర రోడ్ల కంటే చాలా ఎక్కువ. జాతీయ రహదారిపై సగటున 100 కిమీకి 47 మంది మరణించగా, ఇతర రోడ్లలో 100 కి.మీ దూరంలో ఒక వ్యక్తి మాత్రమే మరణించారు.

ఇవి కూడా చదవండి..

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది..!

Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్‌ అథెంటికేషన్‌ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!