AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భగీరత్‌పురలో కలుషిత నీరు కల్లోలం.. 8 మంది దుర్మరణం.. ఆసుపత్రిపాలైన 64 మంది

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. భగీరత్‌పురలో కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. మరో 66 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి మోహన్ ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే కలుషిత నీటి కారణంగా మూడు మరణాలు సంభవించాయని, ఐదుగురు గుండెపోటు కారణంగా చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.

భగీరత్‌పురలో కలుషిత నీరు కల్లోలం.. 8 మంది దుర్మరణం.. ఆసుపత్రిపాలైన 64 మంది
Indore Contaminated Water Deaths
Balaraju Goud
|

Updated on: Dec 31, 2025 | 11:04 AM

Share

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. భగీరత్‌పురలో కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. మరో 66 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి మోహన్ ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే కలుషిత నీటి కారణంగా మూడు మరణాలు సంభవించాయని, ఐదుగురు గుండెపోటు కారణంగా చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.

ఇండోర్‌లో కలుషిత నీరు తాగి నలుగురు మరణించడం చాలా విచారకరం. ఆందోళనకరం అని కాంగ్రెస్ నేత జితు పట్వారీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. సీఎం మోహన్ యాదవ్, మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి ఇండోర్‌లో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటోంది అని పేర్కొన్నారు.

అయితే భగీరత్‌పురలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన రోగుల మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది మంది రోగులు మరణించారు. అయితే, మంగళవారం (డిసెంబర్ 30) రాత్రి ఆలస్యంగా, ఇండోర్ మేయర్ అధికారికంగా ముగ్గురు మరణాలను ధృవీకరించారు. ఈ కేసులో ఇప్పటివరకు మరణించిన వారిలో నంద్ లాల్ పాల్, తారా బాయి, ఉమా కోరి, గోమతి రావత్, సీమా ప్రజాపతి, మంజులత దిగంబర్ వధే, ఊర్మిళా యాదవ్, సంతోష్ బిచోలియా ఉన్నారు. ప్రస్తుతం, ఇండోర్‌లోని వివిధ ఆసుపత్రులలో 66 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు

ఈ విషయాన్ని సీరియస్‌గా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ చర్యలు చేపట్టారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఇందుకు బాధ్యులైన జోనల్ ఆఫీసర్ శాలిగ్రామ్ షిటోల్, అసిస్టెంట్ ఇంజనీర్-ఇన్-చార్జ్ (PHE) యోగేష్ జోషిలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియాను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ ప్రాంతంలో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, బలహీనత కేసులు వేగంగా పెరిగాయి. దాదాపు 2,000 మంది దీని బారిన పడ్డారని సమాచారం. ఇండోర్‌లోని వివిధ ఆసుపత్రులలో చాలా మంది రోగులు చేరారు. 25 నుండి 30 ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటికీ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు, 1,100 కి పైగా ఇళ్లను తనిఖీ చేశారు. నివాసితులు మరిగించిన నీటిని తాగాలని అధికారులు సూచించారు. పరీక్ష కోసం నీటి నమూనాలను పంపారు. 48 గంటల్లో నివేదికలు అందుతాయని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..