AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇంత మంది కూలీలు మృతి చెందడం బాధాకరం.. మోడీతో సహా ప్రముఖుల సంతాపం

రోడ్డు ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 40 మంది వరకు తీవ్రంగా..

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇంత మంది కూలీలు మృతి చెందడం బాధాకరం.. మోడీతో సహా ప్రముఖుల సంతాపం
Madhya Pradesh Bus Accident
Follow us
Subhash Goud

|

Updated on: Oct 22, 2022 | 1:34 PM

రోడ్డు ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 30 (NH-30) పై మూడు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: ప్రధాని మోడీ

మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలి. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రయాణికుల మృతిపై చాలా బాధపడ్డాను: రాష్ట్రపతి

రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల మృతిపై చాలా బాధపడ్డానని ఆమె ట్వీట్‌ చేశారు. హైదరాబాద్ నుండి గోరఖ్‌పూర్ బస్సు ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మృతి గురించి వినడం నాకు చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

గాయపడిన వారు త్వరగా కోలుకోలి: ఉపరాష్ట్రపతి

ప్రమాదం జరగడం చాలా బాధాకరమని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు మరణించడం చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

మృతదేహాన్ని ప్రయాగ్‌రాజ్‌కు పంపిస్తున్నాం: సీఎం శివరాజ్‌

ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. రేవాలో హైదరాబాద్ నుండి గోరఖ్‌పూర్ వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ప్రమాదానికి గురికావడం బాధాకరమైన విషయం. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను అందజేస్తామని సీఎం యోగి ప్రకటించారు

మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతులు యూపీకి చెందిన వారు ఉండటంతో వారి మృతదేహాలను రాష్ట్రానికి తరలించడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుక్క బర్త్‌డే.. సిటీ అంతా భారీ హోర్డింగ్‌లు..! ఎక్కడంటే..?
కుక్క బర్త్‌డే.. సిటీ అంతా భారీ హోర్డింగ్‌లు..! ఎక్కడంటే..?
మఖానా వ్యవసాయం గురించి మీకు తెలుసా? లక్షాధికారులను చేసే వ్యాపారం
మఖానా వ్యవసాయం గురించి మీకు తెలుసా? లక్షాధికారులను చేసే వ్యాపారం
ఖరీదైన లిక్విడ్స్ అక్కర్లేదు.. వాషింగ్ మెషిన్‌ ఇలా క్లీన్ చేయండి
ఖరీదైన లిక్విడ్స్ అక్కర్లేదు.. వాషింగ్ మెషిన్‌ ఇలా క్లీన్ చేయండి
ఏడు కొండలను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు..!
ఏడు కొండలను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు..!
పహల్గామ్‌ ఉగ్రదాడిపై RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఘాటు వ్యాఖ్యలు!
పహల్గామ్‌ ఉగ్రదాడిపై RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఘాటు వ్యాఖ్యలు!
యుద్ధ భయం.. బంకర్లు శుభ్రం చేసుకుంటున్న కశ్మీర్‌ ప్రజలు!
యుద్ధ భయం.. బంకర్లు శుభ్రం చేసుకుంటున్న కశ్మీర్‌ ప్రజలు!
పోస్ట్ ఆఫీస్‌లో ఈ ప్రత్యేక అకౌంట్‌ గురించి మీకు తెలుసా?
పోస్ట్ ఆఫీస్‌లో ఈ ప్రత్యేక అకౌంట్‌ గురించి మీకు తెలుసా?
భారత రోడ్లపైకి మళ్లీ ఆ ఐకానిక్ బైకులు.. రిలీజ్ ఎప్పుడంటే?
భారత రోడ్లపైకి మళ్లీ ఆ ఐకానిక్ బైకులు.. రిలీజ్ ఎప్పుడంటే?
విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు..హిందువునని చెప్పగానే!
విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు..హిందువునని చెప్పగానే!
అధిక ప్రేలాపనలు పేలుతున్న పాకిస్థానీలు..!
అధిక ప్రేలాపనలు పేలుతున్న పాకిస్థానీలు..!