Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Election: ఎన్నిక ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీకి పూలు లేని ఖాళీ పుష్పగుచ్ఛం.. అంతా షాక్..!

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఇండోర్ పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రచార ర్యాలీ పాల్గొన్న ప్రియాంక.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ సమయంలో ఆమె చేసిన ప్రసంగం కంటే స్టేజ్‌పై జరిగిన అనుహ్య ఘటనతో వార్తల్లో నిలిచింది.

MP Election: ఎన్నిక ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీకి పూలు లేని ఖాళీ పుష్పగుచ్ఛం.. అంతా షాక్..!
Priyanka Gandhi Gets ‘empty’ Bouquet
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 08, 2023 | 8:33 AM

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఇండోర్ పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రచార ర్యాలీ పాల్గొన్న ప్రియాంక.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ సమయంలో ఆమె చేసిన ప్రసంగం కంటే స్టేజ్‌పై జరిగిన అనుహ్య ఘటనతో వార్తల్లో నిలిచింది. ప్రియాంక గాంధీ వేదికపైకి చేరుకోగా, కాంగ్రెస్ నేతలు ఆమెకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఒకరు పూలు లేని పుష్పగుచ్ఛాన్ని ప్రియాంక గాంధీకి అందించగా, అది చూసి ప్రియాంక గాంధీ మీరు ఇస్తున్న బొకేలో పూలు లేవని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నేతల వైపు చూపిస్తూ గుత్తిలో పూలు లేవని చెప్పడం కనిపించింది. ఆ తర్వాత తన ప్రసంగంలో ప్రియాంక గాంధీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినప్పుడు పూలు లేని పుష్పగుచ్ఛాన్ని బహూకరించారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో పోల్చిన ఆమె, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పువ్వులు లేని పుష్పగుచ్ఛాలను ప్రదర్శిస్తోందని అన్నారు.

ప్రియాంక స్వయంగా తన ప్రసంగంలో ఖాళీ పుష్పగుచ్ఛాన్ని ప్రస్తావించినప్పుడు, ఇండోర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. వేదికపై ఉన్న ప్రియాంక గాంధీకి పూలు లేకుండా పుష్పగుచ్ఛం అందించిన నాయకుడు దేవేంద్ర సింగ్ యాదవ్, కాంగ్రెస్ అన్ని విభాగాల ఫ్రంట్‌ ఇన్‌ఛార్జ్. మధ్యప్రదేశ్‌లో కూడా భారతీయ జనతా పార్టీ సామాన్య ప్రజలను ఈ విధంగా మోసం చేస్తోందని ప్రియాంక గాంధీకి చెప్పేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక గాంధీకి పూలు లేకుండా పుష్పగుచ్ఛం ఇచ్చానని ఓ వీడియోను విడుదల చేశాడు. మొదట్లో ఒక గుత్తి నిండా పూలు చూపించిన చోట.. తర్వాత అందులో పూలు లేవని తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…