Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election 2024: మోగిన లోక్‌సభ ఎన్నికల నగారా..! ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర అంశాలు..

2024 లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది. తేదీల ప్రకటనకు ముందే ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

Lok Sabha Election 2024: మోగిన లోక్‌సభ ఎన్నికల నగారా..! ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర అంశాలు..
General Election 2024
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 16, 2024 | 4:02 PM

2024 లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది. తేదీల ప్రకటనకు ముందే ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలపై ప్రపంచ దేశాల దృష్టి ఉంటుందన్నారు. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని చెప్పారు. కమిషన్ బృందం అన్ని రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వ్యవస్థను మెరుగుపరిచేందుకు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 10.5 లక్షల ఓటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వివరించారు. 55 లక్షల ఈవీఎంల నుంచి ఓట్లు వేయనున్నారు. దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1.82 కోట్ల మంది కొత్త ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారని తెలిపారు. వీరిలో 85 లక్షల మంది మహిళా ఓటర్లు ఉండగా.. మొత్తం ఓటర్లలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లు. వీరే కాకుండా 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది ఉండగా, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు.

వృద్ధ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఈసారి ఓటింగ్‌ను మరింత మెరుగ్గా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు పలు ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు బూత్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. నామినేషన్‌కు ముందు ఓటర్లందరికీ 12-డి ఫారమ్‌లు ముందుగానే పంపిస్తామని చెప్పారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో అత్యధికంగా పాల్గొనేలా చేయడమే మా ప్రయత్నం అని అన్నారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసే వారిని కఠినంగా శిక్షిస్తాం

నాలుగు సవాళ్లను ఎదుర్కోవడానికి కమిషన్ సిద్ధం

దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సమయంలో హింసను ఎలాగైనా అరికట్టాలన్నారు. కండ బలం, డబ్బు, తప్పుడు సమాచారం, మోడల్ కోడ్ నిబంధనలు అనే నాలుగు రకాల సవాళ్లు మనకున్నాయన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో ధనబలాన్ని నిశితంగా పరిశీలిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షిస్తారన్నారు.

17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16 ముగింపు

17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2014తో ముగియనుంది. అంతకు ముందు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ లేదా కూటమికి మెజారిటీ 272 సీట్లు అవసరం. 2019 లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య 7 దశల్లో ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మే 23 న ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్ కుమార్ తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల మార్గదర్శకాలకు సంబంధించిన కాపీని స్టార్ క్యాంపెయినర్లకు అందజేస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అపోహలను తొలగించేందుకు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ‘Myth vs Reality’ ఏర్పాటు చేస్తామని సీఈసీ వెల్లడించారు.

ఎన్నికల కోసం 2100 మందికి పైగా జనరల్, పోలీసులు, ఇతర పరిశీలకులను మోహరిస్తున్నామని, దురాశ, భయం లేకుండా ఎన్నికల నిర్వహణకు, అందరికీ సమానమైన గౌరవం కల్పించేందుకు కమీషన్‌కు కళ్లు, చెవులుగా నిలుస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది